ఐదు గంటల్లో మూడుచోట్ల రేప్: 6గురు నిందితుల అరెస్ట్
అంతకుముందే పోలీసులు.. సూరత్ పట్టణ సమీపంలోని గోథన్ గ్రామానికి చెందిన మహేష్ అలియాస్ మాసోవాసవ (31), కోసద్లో ఉండే అమిత్ అలియాస్ సోను సింగ్ (32), నితేష్ అలియాస్ పప్పు (19), సందీప్ అలియాస్ రాజ్ (23)లను అరెస్టు చేశారు.
మహిళను రేప్ చేసిన కేసులో ఓ మైనర్ బాలుడితో సహా ఆరుగురిని అరెస్టు చేశామని, మైనర్ బాలుడిని రిమాండ్ హోంకు తరలించామని, అతని వయస్సు తెలుసుకునేందుకు వైద్య పరీక్షలకు పంపించామని అమ్రోలీ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ జీఏ సార్వయ్యా తెలిపారు.
కాగా, వారం రోజుల క్రితం 24 ఏళ్ల మహిళకు ఇంటిని చూపిస్తామని చెప్పి, ఆమె చేతిలోని లగేజ్ తీసుకొని.. ఓ చోటకు తీసుకు వెళ్లి ఐదు గంటలలో మూడు వేర్వేరు చోట్ల ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గుజరాత్ రాష్ట్రంలోని అమ్రోలిలో ఈ దారుణం జరిగింది. 24 ఏళ్ల మహిళపై ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదుగంటల్లో మూడుసార్లు వేర్వేరు ప్రాంతాల్లో ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు. నవంబర్ 18, 19 తేదీల్లో నిందితులు మహిళపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలించి పట్టుకున్నారు. తన పైన ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలు పిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో అద్దె గది కోసం వెతుకుతుంటే సోనూ సింగ్ తనకు సహాయం చేశాడని బాధితురాలు తెలిపింది. కొద్ది రోజుల క్రితం మరో అద్దె గది కోసం ఆమె అతడ్ని మళ్లీ కలిసింది. అతని ఇంటి వద్ద ఆమె కొనుగోలు చేసిన బూట్లు మరిచిపోయి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయింది.
ఆ తర్వాత మళ్లీ తన బూట్లను తిరిగి తెచ్చుకునేందుకు నవంబర్ 18 సాయంత్రం కోసద్లోని అతని ఇంటికి వెళ్లింది. రాత్రి 9గంటల ప్రాతంలో బూట్లను తీసుకుని తిరిగి ఓ ఆటో రిక్షాలో తన ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో బైకుపై వచ్చిన సోనూ సింగ్ మిగిలిన అయిదుగురు ఆమెను సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత కొంతదూరం తీసుకెళ్లి మరో పొలంలో మరోసారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను సోనూసింగ్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై మూడోసారి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదుగంటల్లో ఆరుగురు వ్యక్తులు ఆమెపై మూడుసార్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
నవంబర్ 19న ఉదయం 4గంటల సమయంలో నిందితుల నుంచి తప్పించుకున్న బాధితురాలు అమ్రోలి పోలీస్ ష్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని, నివేదిక వచ్చిన తర్వాత వివరాలు తెలుస్తాయని అమ్రోలి ఇన్స్పెక్టర్ అప్పుడు తెలిపారు. అనంతరం ఇప్పుడు నిందితులను పట్టుకున్నారు.