Sisters: అపార్ట్ మెంట్ లో అందమైన అక్కాచెల్లి, నమ్మించి గ్యాంగ్ రేప్, ఫ్రెండ్స్ కు మరో ఇద్దరు !
జైపూర్: అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న అందమైన అక్కాచెల్లి మీద ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొందరు యువకులు కన్ను వేశారు. అక్కా లేదంటే చెల్లిని ఎలాగైనా లొంగదీసుకోవాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరు యువకులు వారికి పరిచయం అయ్యారు. అపార్ట్ మెంట్ లోకి వెళ్లిన ఇద్దరు యువకులు వాళ్లను నమ్మించి పార్టీ అంటూ ఓ ఇంటికి పిలుచుకుని వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ఇద్దరు అమ్మాయిలను బయటకు వెళ్లకుండా చూశారు. నలుగురు కామాంధులు ఇంటికి లోపల తాళం వేసి అక్కాచెల్లి మీద గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది. కామాంధులు కామం తీరిపోయి మరో గదిలోకి వెళ్లారు. అదే సమయంలో అక్కాచెల్లి ప్రాణాలతో తప్పించుకున్నారు.

అందమైన అక్కాచెల్లెలు
రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా లునియావాస్ పట్టణంలో స్వీటీ (19), రీనా (20) అనే అక్కాచెల్లెలు అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. అందంగా ఉన్న రీనా, స్వీటీ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) కొందరు యువకులు కన్ను వేశారు. అక్కా లేదంటే చెల్లిని ఎలాగైనా లొంగదీసుకోవాలని చాలా మంది ట్రై చేస్తున్నారు.

పోటుగాళ్లు పరిచయం
లూనియావాస్ పట్టణంలో నివాసం ఉంటున్న అటల్, పంకజ్ అనే ఇద్దరు యువకులు అక్కాచెల్లిని లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. ఎవ్వరికి చిక్కని చాన్స్ పంకజ్, అటల్ కు చిక్కింది. అక్కాచెల్లెలు రీనా, స్వీటీ పంకంజ్, అటల్ కు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వీళ్లు అనేకసార్లు బయట కలిశారని సమాచారం.

అక్కాచెల్లికి తియ్యటి మాయమాటలు
రీనా, స్వీటీ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి పంకజ్, అటల్ వెళ్లారు. వాళ్ల అపార్ట్ మెంట్ లోనే కాఫీ తాగిన తరువాత కొంతసేపు అక్కడే ఉన్నారు. అనంతరం మా ఇంట్లో చిన్న శుభకార్యం ఉందని, మీరు తప్పకుండా రావాలని పంకజ్ రీనా, స్వీటీ మీద ఒత్తిడి చేశారు. ఇంతకు ముందే పరిచయం ఉండటం, పంకజ్, అటల్ ఇంతకాలం బుద్దిగా ఉండటంతో శుభకార్యానికి వెళ్లడానికి రీనా, స్వీటీ అంగీకరించారు.

బెడ్ రూమ్ లో కామాంధులు
రీనా, స్వీటీని పిలుచుకుని అదే ఊరిలోని ఓ ఇంటికి వెళ్లారు. రీనా, స్వీటీ వెంట పంకజ్, అటల్ మాత్రే వెళ్లారు. ఇంటి తలుపులు తీసుకుని లోపలికి వెళ్లిన తరువాత ఆ ఇంటి బెడ్ రూమ్ లో నుంచి మరో ఇద్దరు కామాంధులు బయటకు వచ్చారు. ఆ సందర్బంలో నలుగురు అక్కాచెల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా లోపల లాక్ చేసేశారు.

అక్కాచెల్లి మీద గ్యాంగ్ రేప్
నలుగురు కామంధులు అక్కాచెల్లెలి మీద గ్యాంగ్ రేప్ చేశారు. కామాంధుల నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాు చేసి విఫలం అయ్యారు. ఈ విషయం బయటకు చెబితే ఇద్దరిని చంపేసి శవాలను కూడా చిక్కకుండా చేస్తామని నలుగురు అక్కాచెల్లిని బెదిరించారు. చివరికి చాకచక్యంగా తప్పించుకుని ఆ ఇంటి నుంచి ప్రాణాలతో భయటపడిన అక్కాచెల్లెలు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Recommended Video

కామాంధులు ఎస్కేప్
కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ లో నిందితుల మీద కేసు పెట్టారు. అక్కాచెల్లి మీద గ్యాంగ్ రేప్ చేసిన వారిలో ఇద్దరిని పంకజ్, అటల్ గా గుర్తించామని, మిగిలిన ఇద్దరి పేర్లు తెలీదని బాధితులు చెప్పారని, నలుగురు కామాంధుల కోసం గాలిస్తున్నామని ప్రతాప్ నగర్ పోలీసులు చెప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. సొంత అక్కాచెల్లి మీద గ్యాంగ్ రేప్ జరగడం రాజస్థాన్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications