గుర్తు, గుర్తింపు లేకుండానే బరిలోకి 'ఉద్ధవ్ థాకరే'..!
మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 20న పోలింగ్ , నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం విసృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికలు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాలనే బరిలో దించాలని భావిస్తున్నాయి. 288 సీట్లున్న మహారాష్ట అసెంబ్లీలో 145 సీట్లు మెజార్టీ రావాల్సి ఉంది. ఒక్కసారి మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే..
2019లో జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఏ పార్టీకి అండగా నిలవలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ 105 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించగా, శివసేన పార్టీ -56 , ఎన్సీపీ - 54, కాంగ్రెస్ పార్టీ - 44 సీట్లు సాధించాయి. అధికారం కోసం శివసేన ,ఎన్సీపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్ థాకరేను ఉమ్మడి సీఎంగా ఎంపిక చేశారు.

అయితే కొద్ది కాలానికే మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. శివసేన మరియు ఎన్సీపీ పార్టీల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే ,ఎన్సీపీ అజిత్ పవార్.. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపారు. దీంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది. అయితే శివసేన పార్టీ, గుర్తు తమదే అని ఏక్నాథ్ షిండే కోర్టుకు వెళ్లడం, ఆయనకు మద్దతుగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో ఉద్ధవ్ థాకరే రాజకీయ నిరాశ్రయులు అయ్యారు.
రాబోవు ఎన్నికలు ఉద్ధవ్ థాకరేకు చాలా కీలకమనే చెప్పాలి. తన తండ్రి స్థాపించిన పార్టీతో పాటు, ఆ పార్టీ గుర్తును కూడా ఉద్ధవ్ థాకరే పొగొట్టుకున్నారు. దీంతో ప్రస్తుతానికి కామన్ సింబల్తోనే పోటీ చేయడానికి ఉద్ధవ్ థాకరే రెడీ అవుతున్నారు. అయితే ఎటువంటి గుర్తు లేకపోయినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి గట్టి షాక్ ఇస్తూ ఉద్ధవ్ థాకరే యొక్క సేన (UBT) ముంబైలో గణనీయమైన విజయాన్ని సాధించింది.
పార్టీ పేరు, గుర్తును కోల్పోయినప్పటికీ, బాల్ థాకరే వారసత్వానికి అతని వాదనను బలపరిచి, నాలుగు స్థానాలకు మూడు స్థానాలను గెలుచుకుంది. దీంతో ఉద్ధవ్ థాకరే ఫుల్ జోష్లో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.శివసేన పార్టీ, గుర్తు రెండు కోల్పోవడం ఉద్ధవ్ థాకరే మారుతాయని అంతా భావిస్తోన్న తరుణంలో , వాటినే తనకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికలకు రెడీ అవుతున్నారాయన. మరి మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్ థాకరేకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications