Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బడ్జెట్‌లో జైట్లీ ఏం చెప్పారంటే, పూర్తి వివరాలు: వారికి వరాలు, వీరి ఆశలు నీరుగారాయి

Recommended Video

    Union Budget 2018 : Railway Budget ignores Andhra, Bangalore Metro Gets a Boost

    న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాసేపట్లో బడ్జెట్ 2018-19ను ప్రవేశ పెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదికి పైగా సమయం ఉంది. దీంతో వచ్చే ఏడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి ఇది పూర్తిస్థాయి చివరి బడ్జెట్. దీంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగం, రైతులకు, గ్రామీణం, వైద్యానికి పెద్ద పీట వేశారు. జైట్లీ ప్రసంగం అనంతరం లోకసభ 5వ తేదీకి వాయిదా పడింది. ఆదాయపన్ను మినహాయింపు ఉంటుందని భావించినా ఊరట లభించలేదు.

    Feb 01, 2018, 3:09 pm IST

    బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించారని విమర్శలు వినిపిస్తున్నాయి.
    Feb 01, 2018, 2:51 pm IST

    జాతీయ ఆరోగ్య భద్రతా పథకం బాగుందని నితీష్ అన్నారు.
    Feb 01, 2018, 2:51 pm IST

    బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోడీని అభినందించారు.
    Feb 01, 2018, 2:50 pm IST

    ఆర్థిక శాఖ, ప్రధాని మోడీపై చిదంబరం విమర్శలు గుప్పించారు.
    Feb 01, 2018, 2:49 pm IST

    సాధారణ బడ్జెట్‌పై ప్రధాని మోడీ స్పందించారు. ఇది రైతు, గ్రామీణ భారతానికి ఊతమిస్తుందన్నారు.
    Feb 01, 2018, 12:47 pm IST

    సీనియర్ సిటిజన్లకు వైద్య ఖర్చులకు రూ.1 లక్ష వరకు మినహాయింపు. ఉద్యోగులు, పింఛన్‌దారులకు స్టాండర్డ్ డిడక్షన్ 40వేల రూపాయలు. 2018-19 బడ్జెట్ అంచనా 21.57 లక్షల కోట్లు. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానానికి రూపకల్పన.
    Feb 01, 2018, 12:43 pm IST

    బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో మార్కెట్ హెచ్చుతగ్గులు కనిపించాయి.
    Feb 01, 2018, 12:41 pm IST

    ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానానికి రూపకల్పన. స్టేట్ బ్యాంకు తరహాలో ఇన్సూరెన్స్ కంపెనీల విలీనం. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 72,500 కోట్లకు మించి రాబట్టాం. నోట్ల రద్దును జనం ఆహ్వానించారు. ఇది అద్భుతంగా విజయవంతమైంది.
    Feb 01, 2018, 12:34 pm IST

    రాష్ట్రపతి జీతం రూ.5 లక్షలు, ఉపరాష్ట్రపతి వేతనం రూ.4 లక్షలు, గవర్నర్ వేతనం రూ.3.5 లక్షలు. వ్యక్తిగత ఆదాయపన్ను రాబడిలో 11 శాతం అభివృద్ధి. బెంగళూరు మెట్రుకు రూ.17వేల కోట్లు.
    Feb 01, 2018, 12:31 pm IST

    36 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల పునరుద్ధరణ రాష్ట్పతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాలు పెంపు. ఎంపీల జీతభత్యాలు సహా ఇవి ఏప్రిల్ 1 నుంచి చట్టం అమలు. ప్రధాని గృహ నిర్మాణ పథకం కింద రెండేళ్లలో కోటి ఇళ్లు. గత రెండేళ్లలో అదనంగా 90వేల కోట్ల రాబడి.
    Feb 01, 2018, 12:26 pm IST

    వాణిజ్య రంగంలో మరో ఆధార్. భద్రతా దళాల ఆధునికీకరణకు కట్టుబడి ఉన్నాం. ఎంపీల జీతభత్యాల సవరణకు కొత్త చట్టం. ద్రవ్యోల్భణానికి అనుగుణంగా ఎంపీల జీతభత్యాలు. ఎంపీల జీతం అయిదేళ్లకోసారి పెంచేందుకు రెగ్యులేటరీ అథారిటీ.
    Feb 01, 2018, 12:24 pm IST

    ఎయిర్ పోర్టుల సామర్థ్యం 5 రెట్లు పెంచడం టెలికాం మౌలిక సదుపాయాలకు 10వేల కోట్ల రూపాయలు వచ్చే మూడేళ్లలో కాపలాదారులు లేని 4320 రైల్వే కేట్లు ఎత్తివేత. లక్ష గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం. దేశవ్యాప్తంగా 5 లక్షల వైఫై హాట్ స్పాట్లు.
    Feb 01, 2018, 12:24 pm IST

    ముంబైలో 40వేల కోట్లతో 160 కి.మీ. డబ్లింగ్ అహ్మదాబాద్, ముంబై హైస్పీడ్ రైలుకు శంకుస్థాపన చేశాం. ఉడాన్ పథకం కింద 56 ఎయిర్ పోర్టుల అనుసంధానం. రైల్వేలో మౌలిక సదుపాయాలు, కొత్త లైన్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి.
    Feb 01, 2018, 12:24 pm IST

    అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం. రైల్వే ప్రాజెక్టుల కోసం 1.48 లక్షల కోట్లు. 5జీ సౌకర్యానికి రూట్ మ్యాప్. ఏడాదికి 1 బిలియన్ విమాన మంది ప్రయాణీకులే లక్ష్యం టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులకు త్వరలో స్వస్తీ. కొత్త పాలసీకి కేంద్రం మెరుగులు.
    Feb 01, 2018, 12:19 pm IST

    900 కొత్త విమానాల కొనుగోళ్లకు ఆర్డర్లు. 56 విమానాశ్రయాలకు కనెక్టివిటీ సౌకర్యం. 3,073 కోట్లతో డిజిటల్ ఇండియా
    Feb 01, 2018, 12:10 pm IST

    4వేల కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుదీకరణ. సేవ్ గంగా ప్రాజెక్టుకు రూ.17.713 కోట్లు. స్మార్ట్ సిటీలకు రూ.2.04 లక్షల కోట్లు. అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం. ముంబై లోకల్ రైళ్ల కోసం రూ.11వేల కోట్లు. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా విమానయాన రంగ సర్వీసులు. పర్యాటక కేంద్రాలుగా పది పట్టణాలు ఎంపిక.
    Feb 01, 2018, 12:07 pm IST

    విశాఖ రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించలేదు.
    Feb 01, 2018, 12:03 pm IST

    దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాల రంగం. దేశాన్ని రహదారులు, ఎయిర్ పోర్టుల ఓడ రేవులతో అనుసంధానం. రహదారుల నిర్మాణానికి రికార్డ్ స్థాయి బడ్జెట్. 142 నగరాల్లో మౌలిక సదుపాయాలకు ఆర్థిక సాయం. పది ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు దిగ్గజ హోదా.
    Feb 01, 2018, 12:01 pm IST

    పరిశ్రమలకు ఆన్ లైన్ రుణాల జారీ వేగవంతం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరింత సదుపాయం. జాతీయ వైద్య ఆరోగ్య రక్షణ పథకం కింద 50కోట్ల మందికి లబ్ధి.
    Feb 01, 2018, 12:00 pm IST

    వస్త్ర పరిశ్రమకు రూ.70వేల కోట్లు. స్మార్ట్ సిటీలకు రూ.2.04 లక్షల కోట్లు. ప్రతి జిల్లాకు స్కిల్ డెవలప్ డెవలప్‌మెంట్ సెంటర్.
    Feb 01, 2018, 11:56 am IST

    ఈ ఏడాదిలో 70 లక్షల ఉద్యోగాల కల్పన. ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం. ముద్ర యోజన పథకానికి రూ.3 లక్షల కోట్లు (2019 ఆర్థిక సంవత్సరం.) ఉద్యోగుల భవిష్య నిధికి 8.33 శాతం కేటాయింపులు.
    Feb 01, 2018, 11:54 am IST

    విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి 1.35 లక్షల కోట్లు సామాజిక భద్రతకు రూ.9,995 కోట్లు.
    Feb 01, 2018, 11:52 am IST

    సుకన్య అభివృద్ధి యోజన కింద రూ.19,183 కోట్లు. గ్రామీణ రహదారుల నెట్ వర్క్‌తో 3.32 లక్షల ఉద్యోగాల సృష్టి. ప్రధాని గృహ నిర్మాణ పథకం కింద రెండేళ్లలో కోటి మందికి ఇళ్లు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 60 కోట్ల బ్యాంకు అకౌంట్లు తెరిచారు. నమామి గంగే కింద 187 ప్రాజెక్టులు చేపట్టాం. 47 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఎస్సీలకు 56,619 కోట్లు. ఎస్టీలకు 39,115 కోట్లు
    Feb 01, 2018, 11:51 am IST

    24 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల స్థాయి పెంపు. కొత్తగా 18 ఆర్కిటెక్చర్ కాలేజీలు త్వరలో 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలు. జాతీయ వైద్య ఆరోగ్య రక్షణ పథకం కింద 50 కోట్ల మందికి లబ్ధి. ఆయుష్మాన్ భవ పథకం కింద కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల బీమా. రూ.330 కోట్లు చెల్లిస్తే బీమా.
    Feb 01, 2018, 11:41 am IST

    వ్యవసాయ రంగం కోసం 18 కొత్త స్కూళ్లు. విద్యా - పరిశోధనకు 4 లక్షల కోట్లు 4 కోట్ల ఇళ్లకు ఉచిత విద్యుత్. 2022 నాటికి దేశంలో పేదలందరికీ ఇళ్లు. వడోదరలో రైల్వే యూనివర్సిటీ
    Feb 01, 2018, 11:37 am IST

    వచ్చే ఏడాది రూ.11 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు. వెదురు పరిశ్రమకు రాయితీలు. కౌలు రైతులకు కూడా పంట రుణాలు ఇచ్చే కొత్త పద్ధతి. రైతుల ఆదాయం పెంచడానికి కట్టుబడి ఉన్నాం. స్వచ్ఛ భారత్ మిషన్లో 6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం. ఈ ఏడాది 75వేల స్వయం సహాయక గ్రూపులకు రుణాలు. ఉజ్వల పథకం కింద 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్. స్టెంట్ల ధరలు తగ్గించాం. పేదలకు వైద్య పరమైన ఖర్చులు పడకుండా చేశాం. నేషనల్ బ్యాంబూ మిషన్‌కు రూ.1290 కోట్లు ప్రధానమంత్రి సౌభాగ్య యోజనకు రూ.16వేల కోట్లు. చేపల పెంపకం, పశుసంవర్ధక, రొయ్యల పెంపకానికి రూ.10వేల కోట్లు. వచ్చే ఏడాది నాటికి 2 కోట్ల పబ్లిక్ టాయిలెట్స్. నాబార్డుకు ప్రాజెక్టుల కోసం ప్రత్యేక నిధులు. 96 జిల్లాలకు రూ.2600 కోట్లతో తాగునీటి సౌకర్యం. సాంఘిక భద్రతకు రూ.9,975 కోట్లు
    Feb 01, 2018, 11:37 am IST

    మార్కెట్ ధర లేకున్నా రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నాం. జాలర్లకు క్రెడిట్ కార్డులు, ఆపరేషన్ గ్రీన్‌కు రూ.500 కోట్లు. ప్రధాని మోడీ పలుమార్లు బల్లచరిచి ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత వృద్ధికి క్లస్టర్ వ్యవస్థ. సౌరశక్తి ఉత్పత్తి వేగంగా జరిగేలా చేయూత. ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.1400 కోట్ల రూపాయలు.
    Feb 01, 2018, 11:28 am IST

    మార్కెట్ ధర లేకున్నా రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నాం. జాలర్లకు క్రెడిట్ కార్డులు, ఆపరేషన్ గ్రీన్‌కు రూ.500 కోట్లు. ప్రధాని మోడీ పలుమార్లు బల్లచరిచి ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత వృద్ధికి క్లస్టర్ వ్యవస్థ. సౌరశక్తి ఉత్పత్తి వేగంగా జరిగేలా చేయూత. ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.1400 కోట్ల రూపాయలు.
    Feb 01, 2018, 11:26 am IST

    వ్యవసాయ రంగం, రైతులకు తోడ్పాటుపై జైట్లీ ప్రసంగిస్తున్నప్పుడు ఎన్డీయే సభ్యులు బల్లలు చరిచారు. ప్రధాని మోడీ కూడా బల్ల చరిచి సంతోషం వ్యక్తం చేశారు.
    Feb 01, 2018, 11:25 am IST

    జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం.
    READ MORE

    బడ్జెట్ తయారీ ఇలా

    బడ్జెట్ తయారీ ఇలా

    ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో బడ్జెట్ ప్రకటనను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్ర సంస్థలకు పంపిస్తారు. నవంబర్ నెలలో వివిధ వాణిజ్య మండళ్లు, రైతులు, ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారులు చర్చిస్తారు. జనవరిలో బడ్జెట్ మండళ్లు తదితర సంఘాలతో ఆర్థిక మంత్రి సమావేశాలు నిర్వహించి, ప్రణాళికలు రూపొందిస్తారు.

    నార్త్ బ్లాక్ కార్యాలయం

    నార్త్ బ్లాక్ కార్యాలయం

    బడ్జెట్ రూపొందించే గ్రూప్‌లో ఉండే వారంతా ఢిల్లీలోని నార్త్ బ్లాక్ అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి పంపిస్తారు. వారికి అక్కడ ప్రపంచంతో సంబంధం ఉండదు. కుటుంబ సభ్యులతోను నేరుగా మాట్లాడే అవకాశం లేదు. ముందే, హల్వా వేడుక నిర్వహిస్తారు.

    రహస్యంగా బడ్జెట్ ప్రసంగం

    రహస్యంగా బడ్జెట్ ప్రసంగం

    బడ్జెట్ ప్రసంగాన్ని రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రెండు రోజుల ముందు ముద్రణకు ఇస్తారు. బడ్జెట్ పత్రాలను నార్త్ బ్లాక్‌లోని దిగువ భాగంలో ముద్రిస్తారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక నార్త్ బ్లాక్ కార్యాలయంలోని వారంతా బయటకు వస్తారు. బడ్జెట్ ముద్రణ సమయంలో బయటకు తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

    బడ్జెట్ అనే పదం లేదు

    బడ్జెట్ అనే పదం లేదు

    రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదమే లేదు. వార్షిక ఆర్థిక పత్రంగా పేర్కొంటారు. వాడుకలో మాత్రమే అది బడ్జెట్ అయింది. బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీని నిర్ణయించి లోకసభ స్పీకర్‌కు ప్రతిపాదిస్తారు. ఆమోదం లభించాక లోకసభ సచివాలయం ఆమోదం కోరుతుంది. లోకసభలో ఆర్థిక మంత్రి ప్రవేశ పెడతారు. అంతకుముందే కేబినెట్‌కు సంక్షిప్తంగా వివరిస్తారు. ప్రధాని ఆమోదం తర్వాత రాష్ట్రపతికి పంపిస్తారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు దీనిపై చర్చ జరగదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+