బడ్జెట్లో అరుణ్ జైట్లీ వరం: అందరకీ రూ. 5 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: వచ్చే బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశ ప్రజలకు ఓతీపి కబురు వినిపించే అవకాశం ఉంది. దేశ ప్రజలందరికీ రూ.5 లక్షల మేర ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఓ హిందీ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.
ఆరోగ్య బీమాకు సంబంధించిన కేంద్ర పథకాలకు తన బడ్జెట్లో జైట్లీ రూ.5000 కోట్లు కేటాయించవచ్చునని చెబుతున్నారు. ఆరోగ్య బీమా పథకాలకు ఆ నిధుల నుంచి 60 శాతం కేటాయిస్తారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా 40 శాతం భరించాల్సి ఉంటుంది

దేశ ప్రజలందరికీ రూ. 5 లక్షల మేర ఆరోగ్య బీమాను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ట్రస్టును ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని సమాచారం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి, రూ. 2 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి, రూ. 2 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్నవరికి వేర్వేరుగా కల్యాణ్, సౌభాగ్య, సర్వోదయ పథకాలన అమలు చేస్తారని ప్రబాత్ ఖబర్ తెలియజేసింది
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. రూ 2 లక్షలకు లోపు వార్షికాదాయం ఉన్నవారికి నామ మాత్రం ప్రీమియం విధిస్తారు. ప్రస్తుతం దేశ జనాభాలో 4 శాతం మందికి మాత్రమే ఆరోగ్య బీమా ఉంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications