షాకింగ్ : సెకండ్ హ్యాండ్ కారు కోసం... 3 నెలల పసికందును అమ్మేసిన తల్లిదండ్రులు
ఉత్తరప్రదేశ్లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కేందుకు ఓ జంట ఏకంగా 3 నెలల తమ పసిబిడ్డను అమ్మేసింది. శిశువు అమ్మమ్మ,తాతయ్య దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఒక కారు కోసం కన్నబిడ్డనే అమ్మేసిన ఆ తల్లిదండ్రులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే... కన్నౌజ్ పట్టణంలోని తిర్వా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దంపతులు నివసిస్తున్నారు. మూడు నెలల క్రితం వీరికి మగ బిడ్డ జన్మించాడు. ఇటీవల గుర్సాహైగంజ్కి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఆ దంపతులు తమ పసిబిడ్డను అమ్మేశారు. రూ1.5లక్షలకు బేరం కుదుర్చుకుని కన్న కొడుకుని విక్రయించారు. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారు.

కేవలం కారు కొనుక్కోవాలన్న ఉద్దేశంతోనే ఆ దంపతులు తమ కన్న కొడుకును అమ్మేసినట్లు శిశువు అమ్మమ్మ,తాతయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ పసిబిడ్డ సదరు వ్యాపారవేత్త వద్దే ఉన్నాడని... అతన్ని,అతని భార్యను విచారణకు రావాల్సిందిగా కోరామని చెప్పారు. ఆ వ్యాపారవేత్త నుంచి తీసుకున్న డబ్బుతో ఆ దంపతులు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్న మాట వాస్తవమేనని చెప్పారు. కారు కోసమే బిడ్డను అమ్ముకున్నారా అన్నది విచారణలో తేలుతుందన్నారు.
Recommended Video
రెండు నెలల క్రితం తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఆడబిడ్డ పుట్టిన 15 రోజులకే ఓ తల్లి ఆ పసికందును రూ.35వేలకు విక్రయించింది. మిరుదొడ్డి మండలం మల్లంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ పసికందుకు టీకా వేసేందుకు స్థానిక అంగన్వాడీ కార్యకర్త ఆ మహిళ ఇంటికి వెళ్లగా...ఈ విషయం బయటపడింది. పాపను విక్రయించిన విషయాన్ని చెప్పిన ఆ మహిళ... ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అంగన్వాడీ కార్యకర్తను బతిమాలింది. దీనిపై శిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదు అందడంతో అధికారులే నేరుగా రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications