Vande bharat sleeper train: పడుకుని విలాసంగా ప్రయాణించేందుకు రెడీ అవ్వండి!
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. భారతదేశంలో రైలు ప్రయాణ రూపు రేఖలను మారుస్తున్న రైలు. ఇక అధునాతన వందే భారత్ స్లీపర్ రైళ్ళు మరింత సుఖవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించటానికి అందుబాటులోకి రానున్నాయి. దేశంలో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మొదట ఎనిమిది కోచ్ లతో మొదలై 24 కోచ్ లకు పెరిగింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందుతుంది.
వందే భారత్ స్లీపర్ రైళ్ళపై కేంద్ర మంత్రి ప్రకటన
త్వరలో అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైలు పడుకుని ప్రయాణించే విలాసవంతమైన, అధునాతనమైన ప్రయాణ సౌకర్యాన్ని కలిగించనుంది. ఈ క్రమంలో వందేభారత్ స్లీపర్ రైళ్ల పైన రాజ్య సభ వేదికగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. వందేభారత్ స్లీపర్ రైలు మొదటి మోడల్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, అనేక ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

వందే భారత్ స్లీపర్ రైళ్ళ డిజైన్ ఖరారు
త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కుతాయని పేర్కొన్నారు. రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో త్వరలోనే మొదటి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్న ఆయన, వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. భారతీయ రైల్వేలు తయారు చేయనున్న వందే భారత్ స్లీపర్ రైళ్ల డిజైన్లను కూడా ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు.
రెడీ అవుతున్న వందే భారత్ స్లీపర్ రైళ్ళ వివరాలివే
ప్రస్తుతం 10 వందే భారత స్లీపర్ రైళ్లను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మరో 50 వందే భారత స్లీపర్ రైళ్లు తయారవుతున్నాయని, ఇవి కాకుండా 200 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసేందుకు టెక్ భాగస్వాములతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నామని పేర్కొన్నారు.
త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్ళు
KINET రైల్వే సొల్యూషన్స్ లిమిటెడ్ ఒక్కొక్కటి 16 కోచ్లతో 120 వందే భారత్ స్లీపర్ రైళ్లను అందించనుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.ఇదిలా ఉంటే దేశంలోనే మొదటి సెమీ హై స్పీడ్ రైలు అయినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఫిబ్రవరి 15 2019 భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించగా, ప్రస్తుతం వందే భారత్ రైళ్ళు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. ఇక త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్ళు రానున్నాయి.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications