ఇద్దరూ సమానమేనని వరుడికి తాళి కట్టిన వధువు
చెన్నై: తమిళనాడులోని తిరువాయురు జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఎక్కడైనా వివాహ సమయంలో వరుడు వధువు మెడలో తాళి కడతాడు. అయితే ఇక్కడ అందుకు భిన్నంగా వధువు కూడా వరుడికి తాళి కట్టి మూడు ముళ్లు వేసింది.

కమ్యూనిస్టు భావాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తిరువాయూరుకు చెందిన వాసంతి, శ్రీరంగానికి చెందిన సతీష్ కుమార్కు పెద్దలు వివాహం నిశ్చయించారు. దీంతో వీరువురికీ ఆదివారం మారియమ్మన్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. వరుడు సతీష్, వధువు వాసంతి మెడలో తాళి కట్టాడు.
కాగా అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన భోజనాలను హాజరైన బంధువులు ఆరగించారు. ఆ సమయంలోనే వధువు వాసంతి, వరుడు సతీష్ మెడలో తాళిని కట్టింది. దీన్ని చూసిన బంధువులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేం విడ్డూరమని అందరూ భావించారు అయితే వధువు సమాధానం విని సంతృప్తి వ్యక్తం చేశారు. స్త్రీ, పురుషులిద్దరూ కూడా సమానమే కదా అని ఆ వధువు బంధవులకు వివరించింది.












Click it and Unblock the Notifications