సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా కన్నుమూత..
సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా మతిచెందాచారు. ఆయన ఆరోగ్యం గత కొద్దీ రోజుల నుంచి బాగోలేదు. కరోనా వైరస్ సోకింది. తర్వాత ఆయన వీక్ అయిపోయారు. దీంతో ఢిల్లీలో ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. కొద్దీరోజుల నుంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు. అయినా.. ఆరోగ్యం ఏమీ కుదుటపడలేదు. ఇవాళ సాయంత్రం కన్నుమూశారు.
ఈ ఏడాది ఆరంభంలో దువాకు కరోనా సోకింది. తర్వాత ఆయన ఆరోగ్యపరిస్ధితి క్షీణించింది. దీంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. టీవీ జర్నలిజంలో అపార అనుభవం కలిగిన దువా దూరదర్శన్, ఎన్డీటీవీలో దీర్ఘకాలం పనిచేశారు. జర్నలిజం కెరీర్లో పలు ఇతర టీవీ చానెళ్లు, ఆన్లైన్ పోర్టల్స్లో షోలు నిర్వహించారు.
తండ్రి వినోద్ దువా మరణించారని ఆయన కుమార్తె మల్లికా దువా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని రెఫ్యూజీ కాలనీల నుంచి అత్యున్నత పాత్రికేయ నైపుణ్యాలతో ప్రముఖ జర్నలిస్టుగా ఆయన ఎదిగారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన పైలోకంలో తమ అమ్మ దగ్గరికి చేరుకున్నారని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్లో వినోద్ దువా, ఆయన భార్య పద్మావతి దువా వైరస్ బారినపడ్డారు. ఇద్దరు గురుగ్రాం ఆస్పత్రిలో చేరగా దీర్ఘకాలం కొవిడ్-19తో పోరాడుతూ పద్మావతి దువా ఈ ఏడాది జూన్లో కన్నుమూశారు. దువా అప్పుడు కోలుకున్నా.. ఇప్పుడు కరోనా తర్వాత శరీరం దెబ్బతినడంతో చనిపోయారు.
వైర్, హెచ్ డబ్యూలో దువా పొలిటికల్ కామెంటరీ చేసేవారు. గత 42 ఏళ్లుగా నిఖార్సైన జర్నలిస్టుగా పనిచేస్తూ వచ్చారు. ఆదివారం లొధిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని అతని కూతురు మల్లిక దువా తెలిపారు. దువాకు మల్లికతోపాటు మరో కూతురు బాకుల్ దువా ఉన్నారు. ఆమె క్లినికల్ సైకాలజిస్టుగా పనిచేస్తున్నారు. దువా మృతితో వారిద్దరూ తండ్రిని కూడా కోల్పోయారు.
ఇటు సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన సంగతి తెలిసిందే. 66 ఏళ్ల వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉంది. అతను నవంబర్ 20వ తేదీన వచ్చారు. అప్పుడు నెగిటివ్ ఉండగా.. బెంగళూరు ఎయిర్ పోర్టులో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. 22వ తేదీన జినొమ్కు పంపించగా.. 23వ తేదీన నెగిటివ్ వచ్చింది. అతను 24 మంది ప్రైమరీ, 240 సెకండరీ కాంటాక్ట్గా ఉన్నాయి. అతను దుబాయ్ ట్రావెల్ చేశాడు. అన్నీ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వెతికీ మరీ పరీక్షలను చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన వారికి స్వల్పంగా లక్షణాలు ఉన్నాయని.. అందరూ రెండు టీకాలు తీసుకున్నారని వివరించారు.