వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యుల తీరుపై ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్యనాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

|
Google Oneindia TeluguNews

ఇటీవ‌ల కాలంలో చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యులు వ్య‌వ‌హారిస్తున్న తీరుపై భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఆవేదన వ్య‌క్తం చేశారు. ఒక‌ప్పుడు చ‌ట్ట‌స‌భ‌ల్లో ప‌దునైన విమ‌ర్శ‌లు ఉండేవ‌ని గుర్తు చేశారు. కానీ నేడు అందుకు భిన్నంగా స‌భ్యులు వ్య‌వ‌హారిస్తున్నారని పేర్కొన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే నిద్ర కూడా ప‌ట్ట‌డంలేద‌ని అన్నారు. దేశ భ‌విష్య‌త్తుపై ఆందోళ‌న క‌లుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో క‌లుషిత వాతావ‌ర‌ణం..

చ‌ట్ట‌స‌భ‌ల్లో క‌లుషిత వాతావ‌ర‌ణం..


ఢిల్లీలోని ఉపరాష్ట్ర‌ప‌తి నివాసంలో ఏపీ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు యార్ల‌గడ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ ర‌చించిన "గాంధీ టోపీ గ‌వ‌ర్న‌ర్" పుస్త‌కాన్ని వెంక‌య్య నాయుడు ఆవిష్క‌రించారు. ఈ పుస్త‌కాన్ని ప్ర‌ముఖ స్వ‌తంత్ర్య స‌మ‌ర‌మోధుడు ఈడ్పుగంటి రాఘవేంద్రరావు సంక్షిప్త జీవిత‌గాధ నేప‌థ్యంలో యార్ల‌గడ్డ‌ ర‌చించారు. ఈ పుస్త‌క ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా వెంక‌య్య నాడుకు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలోని చ‌ట్ట‌స‌భ‌ల్లో క‌లుషిత వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌భ్యుల భుజ‌బ‌లం చూపించ‌డం ఎక్కువైంద‌ని పేర్కొన్నారు.

భుజ బ‌లం చూప‌డానికి స‌భ్యుల ప్రాధాన్య‌త..

భుజ బ‌లం చూప‌డానికి స‌భ్యుల ప్రాధాన్య‌త..


ప్ర‌జా ప్ర‌తినిధులు చ‌ట్ట‌స‌భ‌ల్లో గౌర‌వంగా నడుచుకోవాల్సిఉంద‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి అన్నారు. చ‌ట్ట‌స‌భ‌లు వ్యాయామం చేసే తాలింఖానాలు కావ‌ని, త‌మ బుద్ధి బ‌లంలో ఎంతటి శ‌క్తిగ‌ల ప్ర‌భుత్వానైనా ఎదించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల కాలంలో స‌భ్యులు త‌మ త‌ప్పులను, ప్ర‌వ‌ర్త‌న‌ల‌ను స‌మర్థించుకోవ‌డం బ‌రితెగింపు అని అన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే దేశ భ‌విష్య‌త్తు ఏమ‌వుతోంద‌న‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వెంక‌య్య‌నాయుడు. భుజ బ‌లం చూప‌డానికి స‌భ్యులు ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా.. బుద్ధి బ‌లాన్ని చూపించి ఎంత‌టి వారినైనా ఎదుర్కోవ‌చ్చన్నారు.

Recommended Video

Chandrababu Crying ప్రెస్ మీట్లోనే ఏడ్చేసిన చంద్రబాబు CBN Challenge In AP Assembly | Oneindia Telugu
 స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల జీవిత చ‌రిత్ర‌ అధ్య‌య‌నం..

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల జీవిత చ‌రిత్ర‌ అధ్య‌య‌నం..


మ‌న దేశచ‌రిత్ర‌లోని వాస్త‌వాల గురించి మ‌రెన్నో ప‌రిశోధ‌న‌లు చేయాల్సి ఉంద‌న్నారు వెంక‌య్య‌నాయుడు. బ్రిటీష్ పాల‌నలో వ‌క్రీక‌రిస్తూ ర‌చించిన మ‌న‌దేశ చ‌రిత్ర‌ను తిరిగి వాస్త‌వ అంశాల‌తో వెలుగులోకి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల జీవిత చ‌రిత్ర‌ల‌ను అధ్య‌య‌నం చేసి వారిని ఆద‌ర్శంగా తీసుకుని మ‌న‌దేశ‌ యువ‌త ముందుకు సాగాల‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి పిల‌పునిచ్చారు. అలాగే వీరి జీవిత చ‌రిత్ర‌ల‌ను అన్ని భాష‌ల్లో ర‌చించి పుస్త‌క రూపంలో మ‌న ముందు త‌రాల‌కు అందిచాల‌ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోరారు.

English summary
Indian Vice President Venkaiah Naidu sensational remarks on Legislature members
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X