Allahabad High Court:అత్యాచార బాధితురాలికి గర్భాన్ని తొలగించుకునే హక్కు ఉంది..
Allahabad High Court: లైంగిక వేధింపులకు గురైన మహిళకు వైద్యపరంగా తన గర్భాన్ని తొలగించుకునే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. 17 ఏళ్ల బాలిక తనకు బిడ్డ కావాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. లైంగిక వేధింపుల సందర్భంలో ఒక మహిళ తన గర్భాన్ని రద్దు చేసుకోకుండా అడ్డుకోవడం, ఆమెను మాతృత్వ బాధ్యతకు బంధించడం అంటే ఆమె గౌరవంగా జీవించే మానవ హక్కును హరించడమే అవుతుందని పేర్కొంది. తల్లి కావడానికి అవును లేదా కాదు అని చెప్పే హక్కు మహిళకు ఉందని కోర్టు తెలిపింది. బాధితురాలికి వైద్యపరంగా గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇస్తూ జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్య చేసింది.
మైనర్ కావడంతో..
భడోహికి చెందిన 17 ఏళ్ల బాలిక తండ్రి తన మైనర్ కుమార్తెను ప్రలోభపెట్టి, కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడనే ఆరోపణలపై సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు. పోలీసులు కూతురిని వెతికి ఆమె తండ్రికి అప్పగించారు. ఈ సమయంలో బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమె 15 వారాల గర్భవతి అని తేలింది. దీనిపై బాధితురాలి తండ్రి మైనర్ తరపున గర్భాన్ని వైద్యపరంగా తొలగించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది మన్మోహన్ మిశ్రా వాదిస్తూ, పిటిషనర్ పై అనేకసార్లు అత్యాచారం జరిగిందని అన్నారు. ఆమె ఇప్పుడు గర్భవతి అని పేర్కొన్నారు. ఇది ఆమె మానసిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతోందని వాదనలు వినిపించారు. పిటిషనర్ మైనర్ కావడంతో పిల్లల బాధ్యతను కోరుకోవడం లేదని కోర్టుకు తెలిపారు.

కోర్టు అనుమతి
బాధితురాలు లైంగిక వేధింపులు లేదా అత్యాచారాలకు గురైనా లేదా మైనర్ అయినా.. 24 వారాల వరకు గర్భాన్ని తొలగించే నిబంధన 2021 మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రూల్స్ ప్రకారం ఉందని కోర్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యపరంగా గర్భస్రావం చేసుకోవడానికి సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులు అనుమతించాయని ఉదాహరణను ప్రస్తావిస్తూ.. గర్భస్రావానికి అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సందర్బగా లైంగిక వేధింపుల కారణంగా గర్భం దాల్చిన బిడ్డను ఉంచుకోవడం లేదా వద్దునుకునే హక్కు బాధితురాలికి ఉంటుందని కోర్టు పేర్కొంది. బాధితురాలు తన తల్లి లేదా సంరక్షకుడితో జిల్లా ఆస్పత్రికి వెళ్లొచ్చని కోర్టు పేర్కొంది. వైద్య పరమైన అడ్డంకులు లేకండా గర్భస్రావం జరిగేలా చూడాలని జిల్లా వైద్య అధికారిని కూడా ఆదేశించారు. అన్ని వైద్య సదుపాయాలను ఉచితంగా అందించాలని.. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే పిండం కణజాలాలను, రక్తనమూనాలను భద్రపరచాలని కోర్టు సూచించింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications