ఏమీ నిర్లక్ష్యం.. దివ్యాంగుడిపై వివక్ష.. ప్లైట్ ఎక్కనీయని సిబ్బంది.. ఆ తర్వాత
వైకల్యం ఉన్నవారికి చేయూతనివ్వాలి. సాయం చేయాలి. హెల్ప్ చేయకపోగా.. దురుసుగా ప్రవర్తించారు. ప్లైట్ ఎక్కనీయలేదు. అతని పేరంట్స్ సహా లోపలే అడ్డుకున్నారు. దీనిపై దుమారం చెలరేగింది. ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కూడా అయ్యింది. దీంతో డీజీసీఏ స్పందించింది. ఘటనపై నివేదిక ఇవ్వాలని సదరు విమాన సిబ్బందిని ఆదేశించింది. ఏం జరిగిందో కూడా స్టాప్ వివరణ ఇచ్చారు.

చిన్నారిపై వివక్ష
పేరంట్స్తో కలిసి దివ్యాంగుడు రాంచి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే అతను కారులో ప్రయాణం చేయడం వల్ల ఇబ్బందికి గురయ్యాడు. ఎందుకంటే అతని రెండు కాళ్లు లేనందున.. కారులో కూర్చొవడం ఇబ్బందికి గురయ్యారు. అప్పటికే అతను కోపం, ఆకలి.. చిరాకు, చికాగుతో ఉన్నాడు. అలా అయితే ఇబ్బందిగానే ఉంటారు. అలా అతను ఉన్నాడు. పేరంట్స్తో గొడవ పడ్డాడు. మరాం చేయడంతో సమస్య వచ్చింది. ఇంతలో ప్లైట్ ఎక్కడానికి వెళ్లగా వారికి చుక్కెదురు అయ్యింది.

అడ్డుకొని.. పంపించని వైనం
ప్రైవేట్ వినానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. బోర్డింగ్కు అనుమతి ఇవ్వలేదు. అయితే చిన్నారి అల్లారి ఆపలేదు. అతను కామ్గా ఉంటే తప్ప తాము విమానం ఎక్కనీయబోమని తేల్చిచెప్పింది. అయితే తాము అతనిని కంట్రోల్ చేస్తామని.. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని పేరంట్స్ హామీనిచ్చారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. అదే విమానంలో వెళుతున్న వైద్యులు కూడా.. పిల్లాడు బానే ఉన్నాడని ఎయిర్ పోర్టు సిబ్బందికి తెలియజేశారు. అతని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. అందుకోసమే వారిని అనుమతించడం లేదని తేల్చిచెప్పారు.

చిన్నారి మారం చేయడంతో..
అతను అల్లరి చేయకుండా ఉంటే పంపిస్తామని గ్రౌండ్ స్టాప్ చెప్పారు. కానీ వారిని మాత్రం వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. వారికి హోటల్లో వసతి కల్పించి.. ఆ మరునాడు వేరే విమానంలో గమ్యస్థానానికి పంపించేశారు. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేసింది. అలా చేసి.. అప్పటికప్పుడు చేతులు దులుపుకుంది.

నీళ్లు, జ్యూస్ అందించారు..
అయితే అంతకుముందు కూడా దివ్యాంగుడు బాగున్నాడని మరొకరు పేర్కొన్నారు. అతనికి నీరు, జ్యూస్ అందించారు. మందులు అందజేసి రెడీ చేశారు. కానీ సిబ్బంది మాత్రం అలా చేయలేదు. మిగతా ప్రయాణికుల పేరు చెప్పి వారిని నిలిపివేశారు. వారికి వసతి అందజేశారు. మరునాడు ప్లైట్లో పంపించారు.. వారికి కలిగిన అసౌకర్యానికి మాత్రం బాధ్యులు ఎవరనే అంశం చర్చకు వచ్చింది. దీనిపై డీజీసీఏ సీరియస్గా ఉంది. ఆ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ను నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. జరిగిన ఘటనపై తమ వెర్షన్ను సదరు విమానాయాన సంస్థ తెలిపింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications