video:ఇదేం పని శునకం.. పాపం పిల్లాడిని, లిప్టులో ఒంటరిగా చూసి..
కొందరికీ డాగ్స్ అంటే ప్రేమ.. వాటిని పెంచుకుంటారు. ఇంజెక్షన్ల కోసం డబ్బులు కూడా ఖర్చుచేస్తారు. అయినా మరికొందరు భయపడుతుంటారు. అయితే లిప్ట్లో ఓ పెంపుడు శునకం.. పిల్లాడిని కరిచింది. దాని ఓనర్ అక్కడే ఉన్నా.. నియంత్రించలేదు. అవును..ఆ వీడియో సీసీటీవీలో స్పస్టంగా కనిపించింది.
ఘజియాబాద్ రాజ్ నగర్ ఎక్స్ టెన్సన్ చార్జ్ కౌంటీ సొసైటీ వద్ద రాత్రి 6 గంటల సమయంలో ఘటన జరిగింది. సీసీటీవీలో పెట్ డాగ్.. దాని ఓనర్ ఉన్నారు. మరొ పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే దాని బారి నుంచి తప్పించుకునేందుకు వెళ్లాడు. ఇంకేముంది.. ఇంతలోనే అదీ కాటు వేసింది. నొప్పి తాళలేక పిల్లాడు ఇబ్బంది పడ్డాడు. వీడియోలో స్పష్టంగా కనిపించింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. పిల్లాడు తల్లడిల్లగా.. డాగ్ ఓనర్ పట్టించుకోలేదు. ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం చూడలేదు కూడా.. విషయం తెలిసి చిన్నారి పేరంట్స్ నంద్ గ్రామ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాగ్ ఓనర్పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వాస్తవానికి ఆ చిన్నారి చాలా భయపడ్డాడు. అయినప్పటికీ ఆ కుక్క కరవనే కరిచింది. క్షణకాలంలో ఎగిరి వచ్చి మరీ కరిచింది. దాని ఓనర్ ఉన్నా.. లేనట్టే.. ఎందుకంటే పిల్లాడికి ఏం జరిగిందని కనీసం చూడను కూడా చూడలేదు. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. పిల్లాడి పట్ల ఎందుకు దయలేకుండా ప్రవర్తిస్తున్నారు అని కామెంట్ చేస్తోన్నారు.