మామ్ సక్సెస్పై జగన్ హర్షం, జయలలితకి రోజా ప్రశంస
కడప/చెన్నై: అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతంగా ప్రవేశించడం భారత అంతరిక్ష యుగంలో సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు.
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో ఇదో అద్భుత చారిత్రక రోదసీ ఘట్టమన్నారు. మామ్ ప్రయోగం సక్సెస్ కావడంతో భారత శాస్త్రవేత్తల శక్తి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినట్లయిందని అన్నారు. కాగా, అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశ పెట్టిన మొట్టమొదటి దేశంగానే కాకుండా తొలి ప్రయత్నంలోనే ఆ ఘనత సాధించిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

జయలలిత ప్రేరణ: రోజా
తనకు అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితనే ప్రేరణ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు రోజా వేరుగా అన్నారు.
జయలలిత రాజకీయాలలోకి వచ్చినప్పుడు తాను చూశానని, ఆమె చాలా దృఢసంకల్పం కలవారని రోజా అన్నారు. తాను ఎప్పుడు తన నియోజకవర్గం వారికి అందుబాటులో ఉంటానని చెప్పారు. రోజా ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నారట. అయితే, సినిమాల్లోకి వచ్చిన ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications