Wife vs Husband: భార్య చపాతి, చికెన్ కర్రీ స్కెచ్, మధ్యలో వదిలేసి పరుగు తీసిన భర్త, మ్యాటర్ !
చెన్నై/తుత్తుకూడి: హ్యాపీగా భార్యతో సంసారం చేస్తున్న భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్త విపరీతంగా మద్యం సేవిస్తున్నాడు. పొలం పనులు చేయిస్తున్న భార్య ఆమె భర్త తీరుతో విసిగిపోయింది. మద్యం సేవించే విషయంలోనే దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. భార్య, భర్తకు మరో విషయంలో గొడవలు జరుగతున్నాయి. భర్తను చంపడానికి భార్య సూపర్ స్కెచ్ వేసింది. ఇంట్లో చికెన్, చపాతీలు చేసిన భార్య ఆమె భర్తకు ప్రేమగా వడ్డించింది. మద్యం మత్తులో ఉన్న భర్త కొంచెం చికెన్ చపాతి తిన్నాడు. అంతే భర్తకు అనుమానం మొదలైయ్యింది. చికెన్ లో విషం కలిపారని గుర్తించిన భర్త ఇంటి బయటకు పరుగు తీసి పక్కనే ఉన్న బంధువులకు విషయం చెప్పి అక్కడే కుప్పకూలిపోయాడు. విషం కలిపిన ఆహారం తిన్న భర్త ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తన భర్తను ఎందుకు చంపాలని అనుకున్నానో అని భార్య స్టోరీ మొత్తం చెప్పింది.భర్త తీరుతో విసిగిపోయింది. మద్యం సేవించే విషయంలోనే దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. భార్య, భర్తకు మరో విషయంలో గొడవలు జరుగతున్నాయి. భర్తను చంపడానికి భార్య సూపర్ స్కెచ్ వేసింది.

సొంత ఊరిలో దంపతులు
తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని ఎట్టాయం ప్రాంతంలో మాడస్వామి (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 13 సంవత్సరాల క్రితం మాడస్వామి ఇందిరా (32) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మాడస్వామి, ఇందిరా దంపతులకు వైష్ణవి (12), ముకాసిని (8) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

విపరీతంగా తాగుతున్న భర్త
హ్యాపీగా భార్య ఇందిరాతో సంసారం చేస్తున్న ఆమె భర్త మాడస్వామి మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ప్రతిరోజూ రాత్రి మద్యం సేవించకుండా ఇంటికి వెళ్లడం మాడస్వామికి సాధ్యం కాలేదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత మాడస్వామి విపరీతంగా మద్యం సేవిస్తున్నాడు. పొలం పనులు చేయిస్తున్న ఇందిరా సంసారాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసిన ఆమె భార్య మాడస్వామి తీరుతో విసిగిపోయింది.

లెక్కలేనన్ని పంచాయితీలు
మాడస్వామి, ఇందిరా దంపతులు పదేపదే గొడవ పడుతున్నారు. విషయం తెలుసుకున్న మాడస్వామి బంధువులు, ఇందిరా బంధువులు అనేకసార్లు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పదేపదే మాడస్వామి, ఇందిరా దంపతులు గొడవపడుతున్నారు. కూతుర్ల విషయం కూడా పట్టించుకోకుండా మాడస్వామి పదేపదే మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్యతో గొడవపడుతున్నాడు.

భార్య అంతు చూడాలని స్కెచ్ వేసిన ఇందిర
భర్త మడస్వామి తీరుతో అతని భార్య ఇందిరా విసిగిపోయింది. మద్యం సేవించే విషయంలోనే మాడస్వామి, ఇందిరా దంపతుల మద్య గొడవలు రానురాను ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోవడంతో ఇందిరా రగిలిపోయింది. దంపతుల మద్యలో మరో విషయంలో గొడవలు జరుగతున్నాయి. భర్త మాడస్వామిని చంపడానికి అతని భార్య ఇందిరా సూపర్ స్కెచ్ వేసింది.

చపాతి, చికెన్ కర్రీలో విషం మిక్స్
రాత్రి పీకలదాక మద్యం సేవించిన మాడస్వామి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో చికెన్, చపాతీలు చేసిన ఇందిరా ఆమె భర్త మాడస్వామికి ప్రేమగా వడ్డించింది. అంతకు ముందే ఇందిరా ఆమె భర్త తినే ఆహారంలో, చికెన్ లో పురుగుల మందు కలిపేసింది. మద్యం మత్తులో ఉన్న మాడస్వామి కొంచెం చికెన్ చపాతి తిన్నాడు. అంతే మాడస్వామికి చికెన్ లో పురుగుల మందు కలిపారని అనుమానం మొదలైయ్యింది.

బంధువులకు మ్యాటర్ మొత్తం చెప్పి కుప్పకూలిపోయాడు
చికెన్ లో విషం కలిపారని గుర్తించిన మాడస్వామి ఇంటి బయటకు పరుగు తీశాడు. ఇంటి పక్కనే ఉన్న బంధువులకు నా భార్య ఇందిరా విషం కలిపిందని చెప్పి అక్కడే కుప్పకూలిపోయాడు. మాడస్వామి చెప్పిన మాటలు విన్న బంధువుల హడలిపోయి వెంటనే అతని తుత్తకూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

భర్తను చంపడానికి స్కెచ్ వేసిన భార్య అందర్
విషయం కలిపిన ఆహారం తిన్న మాడస్వామి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు అన్నారు. తన భర్త మాడస్వామిని ఎందుకు చంపాలని అనుకున్నానో అని అతని భార్య ఇందిరా స్టోరీ మొత్తం పోలీసులకు చెప్పింది. నా భర్త మాడస్వామి తీరుతో విసిగిపోయాయని, అతను మద్యం సేవించే విషయంలోనే మా మద్య గొడవలు ఎక్కువ అయ్యాయని, పెద్దలు పంచాయితీలు చేసినా తన భర్త మారలేదని, ఇక ముందు కూడా నా భర్త మారడని ఇలా చేశారని ఇందిరా పోలీసులకు చెప్పింది. భర్త మాడస్వామితో ఆమె భార్య ఇందిరాకు మరో విషయంలో గొడవలు జరుగతున్నాయని తెలిసిందని, భర్తను చంపడానికి సూపర్ స్కెచ్ వేసిన ఇందిరాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications