మోడీ చాయ్ కొన్న వారికి దిగ్విజయ్ బంపర్ ఆఫర్!
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిన్నప్పుడు తాను చాయ్ అమ్మానని ప్రధాని నరేంద్ర మోడీ అనేకమార్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై దిగ్విజయ్ సింగ్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
నరేంద్ర మోడీ వద్ద గతంలో ఎవరైనా చాయ్ కొని ఉన్నట్లుగా నిరూపించగలిగితే తాను రెండు లక్షల నజరానా ఇస్తానని దిగ్విజయ్ సింగ్ ప్రకటిచారు. అలాగే ఆయనతో కలిసి డిగ్రీ చదివినట్లుగా ఎవరైనా రుజువు చేయగలిగితే వారికి కూడా 2లక్షలు ఇస్తానని చెప్పారు.

మహారాష్ట్రంలోని అర్నిలో రైతులతో బహిరంగ సభ నిర్వహించిన సందర్భంగా దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'చాయ్ కీ చర్చా' పేరిట రైతుల నిరసన ర్యాలీలో దిగ్విజయ పాల్గొన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయారని మోడీపై ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే దాభాడి ప్రాంతంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. తప్పుడు వాగ్ధానాలతో రైతులను మోసం చేశారని దిగ్విజయ్ మండిపడ్డారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications