కరోనా విలయం: సీజేఐ రమణ హెచ్చరిక -జస్టిస్ బోబ్డే వీడ్కోలు సభలో కీలక వ్యాఖ్యలు -సుప్రీం ఎదుట భారీ సవాళ్లు
దేశంలో ఆరోగ్య రంగాన్ని కుదిపేస్తూ, మిగతా వ్యవస్థలన్నిటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న కరోనా విలయంపై నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితులపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టులు ఏకిపారేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. సీజేఐగా జస్టిస్ బోబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.దేశంలో ఆరోగ్య రంగాన్ని కుదిపేస్తూ, మిగతా వ్యవస్థలన్నిటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న కరోనా విలయంపై నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితులపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టులు ఏకిపారేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. సీజేఐగా జస్టిస్ బోబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

బోబ్డేతో మర్చిపోలేని అనుభవం
సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డేతో కలిసి పనిచేసిన కాలాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వీడ్కోలు పలకడం అనేది చాలా కష్టమైన పని అని, అయితే, జస్టిస్ బోబ్డే భిన్న అభిరుచులు కలిగిన వ్యక్తి కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలన్నది ఇప్పటికే నిర్ణయించుకుని ఉండొచ్చని, బోబ్డేలోని తెలివి, శక్తి సామర్థ్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని జస్టిస్ రమణ అన్నారు. భవిష్యత్లో బోబ్డే చేసే అన్ని ప్రయత్నాల్లో మంచి జరగాలని ఆకాంక్షించారు. కరోనా కాలంలో ప్రజలకు న్యాయం అందించడం కోసం జస్టిస్ బోబ్డే ఈ-కోర్టులను, వర్చువల్ విచారణలను ప్రారంభించారని, మహమ్మారి సమయంలోనూ మౌలిక సదుపాయాల కల్పనకు బోబ్డే కృషి చేశారని రమణ కొనియాడారు.

కరోనాపై కఠిన చర్యలు తప్పవా?
జస్టిస్ బోబ్డే పదవీ విరమణ సందర్భంలో మాట్లాడుతూ దేశంలో కరోనా పరిస్థితులపై జస్టిస్ రమణ హెచ్చరిక లాంటి వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ప్రస్తుతం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నదని, ఇలాంటి క్లిష్ట సమయంలో కొన్ని బలమైన చర్యలు తీసుకొని వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని, చేతులు కడుక్కోవాలని, అవసరమైతే తప్ప బయటికి రావొద్దన్నారు. సుప్రీం, హైకోర్టు జడ్జిలు సైతం వైరస్ బారిన పడటాన్ని గుర్తుచేస్తూ, క్రమశిక్షణతోనే కరోనా మహమ్మారిని ఓడించగలమని, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా కఠిన చర్యలు అవసరమని జస్టిస్ రమణ అన్నారు. శుక్రవారం సీజేఐగా బాధ్యతల చేపడుతోన్న జస్టిస్ రమణ ఎదుట భారీ సవాళ్లెల్లో నిలిచాయి..

జస్టిస్ రమణకు భారీ సవాళ్లు..
కరోనా విలయం, ప్రభుత్వ ఉదాసీనత, రాష్ట్రాల వేడుకోళ్లు, ప్రజల హాహాకారాలు, మరో వారం దాకా ఆక్సిజన్ కొరత తీరని పరిస్థితి, రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాల నమోదు, వ్యాక్సిన్ ధరలపై రగడ, ఆంక్షల వల్ల పని కోల్పోయిన పేదల ఆకలి కేకలు... ఇవన్నీ ప్రస్తుతం దేశం ముందున్న సవాళ్లుకాగా, జస్టిస్ బోబ్డే తన 14 నెలల పదవీ కాలంలో కనీసం ఒక్క జడ్జిని కూడా నియమించకపోవడంతో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ, కొండలా పేరుకుపోయిన పెండింగ్ కేసులు, వివిధ స్టాయిల కోర్టుల మధ్య సమన్వయలోపం తదితర అంశాలు జస్టిస్ రమణ ముందు సవాళ్లుగా నిలిచాయి. కొవిడ్ విలయానికి సంబంధించిన అన్ని కేసులను సుమోటోగా సుప్రీంకోర్టే విచారిస్తుందని జస్టిస్ బోబ్డే చెప్పినప్పటికీ, అందుకు విరుద్ధంగా రాష్ట్రాల హైకోర్టులు ఇవాళ కూడా కొవిడ్ పిటిషన్లను విచారించడం చర్చకు దారితీసింది. శుక్రవారం నుంచి జస్టిస్ రమణ సారధ్యంలో నడవనున్న సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు వెలువరించబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications