వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా: 3లక్షల మంది బలి -కొత్తగా 2.2లక్షల కేసులు -తగ్గుతోన్న వైరస్ ఉధృతి

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. కొత్త కేసుల ఉధృతి క్రమంగా తగ్గుతున్నా, మరణాల సంఖ్య మాత్రం పైపైకి వెళుతూ ఆందోళనల్ని రెట్టింపు చేస్తున్నది. నిన్న ఒక్కరోజే నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాలు మూడులక్షల మార్కును దాటాయి. గ్లోబల్ గా కరోనా మరణాల్లో భారత్ 3వ స్థానంలో ఉండగా, అమెరికా, బ్రెజిల్‌ తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి..

Recommended Video

New Coronavirus Found In Malaysia That Can Transfer From Dogs To Humans || Oneindia Telugu

viral video:అగ్నిపర్వతం బద్దలు -ఇళ్లపైకి లావా -15మంది మృతి -170 మంది చిన్నారులు గల్లంతుviral video:అగ్నిపర్వతం బద్దలు -ఇళ్లపైకి లావా -15మంది మృతి -170 మంది చిన్నారులు గల్లంతు

కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెలువరించిన బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 19,28,127 శాంపిళ్లను పరీక్ష చేయగా, కొత్తగా 2,22,315 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. అయితే మరణాలు మాత్రం నిన్న ఒక్కరోజే 4,454గా నమోదయ్యాయి. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 3,03,720కు, మొత్తం కేసుల సంఖ్య 2,67,52,447కు పెరిగాయి.

 with 4,454 new deaths, India Covid toll cross 3-lakh mark, 2.22 lakh fresh cases

గడిచిన 24 గంటల్లో 3,02,544 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వారా మొత్తం రికవరీల సంఖ్య 2,37,28,011కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 27,20,716 యాక్టివ్‌ కేసులున్నాయని చెప్పింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 88.30శాతం, మరణాలు రేటు 1.13శాతం ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక..

ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!

వ్యాక్సిన్ల కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 19,60,51,962 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. ఇక, నిన్న ఒకే రోజు దేశవ్యాప్తంగా 19,28,127 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 33,05,36,064 శాంపిల్స్‌ పరీక్షించినట్లు పేర్కొంది.

English summary
India’s Covid deaths crossed 3-lakh mark, with the death toll mounting to 3,03,720. The country registered 2,22,315 new cases of Covid-19 in the last 24 hours. Top five states which have registered maximum cases are Tamil Nadu with 35,483 cases, followed by Maharashtra with 26,672 cases, Karnataka with 25,979 cases, Kerala with 25,820 cases and Andhra Pradesh with 18,767 cases. 59.7% of the new cases are reported from these five states, with Tamil Nadu alone responsible for 15.96% of the new cases. The country recorded 4,454 fatalities in the last 24 hours. Maximum casualties were reported in Maharashtra (1,320), followed by Karnataka with 624 daily deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X