భారత్లో కరోనా: 3లక్షల మంది బలి -కొత్తగా 2.2లక్షల కేసులు -తగ్గుతోన్న వైరస్ ఉధృతి
దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. కొత్త కేసుల ఉధృతి క్రమంగా తగ్గుతున్నా, మరణాల సంఖ్య మాత్రం పైపైకి వెళుతూ ఆందోళనల్ని రెట్టింపు చేస్తున్నది. నిన్న ఒక్కరోజే నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాలు మూడులక్షల మార్కును దాటాయి. గ్లోబల్ గా కరోనా మరణాల్లో భారత్ 3వ స్థానంలో ఉండగా, అమెరికా, బ్రెజిల్ తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి..
Recommended Video
viral video:అగ్నిపర్వతం బద్దలు -ఇళ్లపైకి లావా -15మంది మృతి -170 మంది చిన్నారులు గల్లంతు
కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెలువరించిన బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 19,28,127 శాంపిళ్లను పరీక్ష చేయగా, కొత్తగా 2,22,315 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. అయితే మరణాలు మాత్రం నిన్న ఒక్కరోజే 4,454గా నమోదయ్యాయి. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 3,03,720కు, మొత్తం కేసుల సంఖ్య 2,67,52,447కు పెరిగాయి.
గడిచిన 24 గంటల్లో 3,02,544 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వారా మొత్తం రికవరీల సంఖ్య 2,37,28,011కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 27,20,716 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 88.30శాతం, మరణాలు రేటు 1.13శాతం ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక..
ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!
వ్యాక్సిన్ల కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 19,60,51,962 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. ఇక, నిన్న ఒకే రోజు దేశవ్యాప్తంగా 19,28,127 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 33,05,36,064 శాంపిల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.