చైనా 'పైత్యం': ఇండియా వెనక్కి తగ్గిందని, ట్రై జంక్షన్ తమదేనంటూ!
డోక్లామ్ ప్రాంతంలో మోహరించిన సైన్యంలో అత్యధిక భాగాన్ని భారత్ ఉపసంహరించుకుందని, ఇది తమకు లభించిన నైతిక విజయమని చైనా మీడియా పేర్కొనడం గమనార్హం.
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య డోక్లామ్ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఊహాజనిత కథనాలను ప్రచురిస్తూ ఇండియాను పరోక్షంగా దెబ్బతీసేలా చైనా వేస్తున్న ఎత్తుగడలు కొనసాగుతూనే ఉన్నాయి. డోక్లామ్ వివాదం మొదలైన నాటి నుంచి చైనా గ్లోబల్ మీడియా ఇండియాపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది.
తాజాగా డోక్లామ్ ప్రాంతంలో మోహరించిన సైన్యంలో అత్యధిక భాగాన్ని భారత్ ఉపసంహరించుకుందని, ఇది తమకు లభించిన నైతిక విజయమని చైనా మీడియా పేర్కొనడం గమనార్హం. మరోవైపు భారత్ మాత్రం చైనా వ్యాఖ్యలను ఖండించింది. డోక్లామ్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.

కాగా, నెల రోజుల క్రితం సుమారు 400 మంది వరకు సైన్యాన్ని భారత్ డోక్లామ్ సరిహద్దులో మోహరించిందని, కానీ ఇప్పుడా సంఖ్య 40కి తగ్గిందని చైనా వెల్లడించింది. దీనికి సంబంధించి బుధవారం నాడు 15పేజీల ఒక స్టేట్మెంట్ ను విడుదల చేస్తూ మ్యాప్స్, ఫోటోగ్రాఫ్ తదితరాలతో డోక్లామ్ వాస్తవ పరిస్థితి ఇదేనంటూ ఒక కథనాన్ని వెలువరించింది.
భారత్ వెనక్కి తగ్గడంతో సిక్కీం, భూటాన్, టిబెట్ ట్రై జంక్షన్ ప్రాంతం తమదేనని మరోసారి స్పష్టమైందని చైనా పేర్కొంది. అంతేకాదు, భారత్ వెనకడుగు వేయడంతో 45రోజుల పాటు కొనసాగిన సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడినట్లు తెలిపింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లి, చైనా జాతీయ సలహాదారు యాంగ్ జీచీతో చర్చలు జరిపిన అనంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
-
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications