వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుత్తితో బాది టెక్కీ హత్య: కేసులో భార్య అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman arrested for murdering techie husband
ఘజియాబాద్: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో పోలీసులు అతని భార్యను అరెస్టు చేశారు. ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలోని ఇంట్లో మార్చి 9వ తేదీన టెక్కీ హత్యకు గురయ్యాడు. వైశాలినే మొదటి నుంచీ పోలీసులు అనుమానిస్తూ వచ్చారు.

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య వైశాలి తన భర్త అయిన టెక్కీ సిఎస్ దయాకర్‌ను సుత్తితో కొట్టి చెంపినట్లు పోలీసులు చెప్పారు. ఆ దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. వైశాలి నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిద్రిస్తున్న సమయంలో భర్తపై వైశాలి దాడి చేసి చంపిందని పోలీసులు భావిస్తున్నారు.

గొడవ తర్వాత తాను తన తల్లిగారింటికి వెళ్లానని, తిరిగి ఇంటికి వచ్చేసరికి తన భర్త దయాకర్ మరణించి కనిపించాడని వైశాలి తొలుత పోలీసులకు చెప్పింది. దయాకర్ నోయిడాలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. దయాకర్ ఇంటి నుంచి మార్చి 7వ తేదీ రాత్రి గొడవ జరుగుతున్నట్లు, దాడి జరిగినట్లు శబ్దాలు వినిపించాయని ఇరుగుపొరుగువారు పోలీసులకు చెప్పారు.

తనకూ తన భర్తకు మధ్య 7వ తేదీన పెద్ద గొడవ జరిగిందని పోలీసులకు చెప్పింది. గొడవ జరిగిన తర్వాత తాను తల్లిదండ్రులతో మాట్లాడలేదని వైశాలి తన వాంగ్మూలంలో పోలీసులకు చెప్పింది. అయితే, ఆ రాత్రి వైశాలి వరుసగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లు, మెసేజ్‌లు పంపినట్లు ఆమె మొబైల్ ఫోన్ వివరాలు తెలియజేస్తున్నాయని వారన్నారు.

English summary
Police today arrested a woman for allegedly killing her software engineer husband who was found murdered at his residence in the Indirapuram area in Ghaziabad on March 9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X