కట్ చేసింది: ప్రియుడితో పట్టుబడిన భార్య ... భర్తనుఏమి చేసిందో తెలుసా..?
వేలూరు: భార్య భర్తల గొడవలో భర్త అంగాన్ని భార్య కొరికేసిన ఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వేలూరు జిల్లా తురైమూలై గ్రామంలో సెంతామరై, జయంతి దంపతులు నివాసముంటున్నారు. సెంతామరై ఆ గ్రామంలో రైతు. గ్రామంలోని ఆలయ ఉత్సవాల్లో భాగంగా దంపతులిద్దరూ అక్కడ జరిగే వేడుకలను వీక్షించేందుకు వెళ్లారు. ఉత్సవాలు వీక్షించిన తర్వాత స్థానిక క్రీడల్లో పాల్గొన్నారు. అప్పటికే తెల్లవారుజాము 1.30 గంటలు అయ్యింది. కొంచెం సేదతీరుతానని చెప్పిన జయంతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ భర్త సెంతామరై వెళ్లాడు.
అలా భార్య కోసం వెతుక్కుంటూ వెళ్లిన సెంతామరైకు జయంతి తన ప్రియుడు దక్షిణామూర్తితో అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించింది. ఇది చూసి షాక్కు గురయ్యాడు సెంతామరై. అదే సమయంలో కోపోద్రిక్తుడయ్యాడు. వారిద్దరి అక్రమ సంబంధం గురించి బయటపెడుతానని సెంతామరై బెదిరించాడు. ఇద్దరినీ బయటకు లాక్కొచ్చాడు. తమను కాపాడాల్సిందిగా దక్షిణ మూర్తి కేకలు వేసినప్పటికీ... ఊరంతా ఉత్సవాల సందడిలో మునిపోయి ఉండటం, డప్పుల శబ్దానికి ఆయన కేకలు వినపడలేదు.

ఇద్దరిని లాక్కొచ్చే క్రమంలో సెంతామరై దోతీ ఊడిపడింది. అప్పటికే భయంతో ఉన్న జయంతి గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకోకముందే తప్పించుకోవాలని భావించింది. భర్త సెంతామరైతో పెనుగులాటకు దిగింది. ఈ క్రమంలోనే సెంతామరై పురుషాంగాన్ని కొరికి... తన ప్రియుడు దక్షిణామూర్తితో పారిపోయింది. రక్తస్రావంతో సెంతామరై అక్కడే పడిపోయాడు. కాసేపటికి సెంతామరైను గమనించిన గ్రామస్తులు వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి చెన్నైలోని రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీకి మెరుగైన చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
దక్షిణా మూర్తి సెల్ ఫోన్ నంబర్ను ట్రాక్ చేసి దాని ఆధారంగా జయంతిని పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చేసిన నేరం జయంతి కోర్టులో ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. వేలూరు మహిళా సెంట్రల్ జైలుకు జయంతిని తరలించారు పోలీసుల.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications