బలవంతంగా మద్యం తాగించి మహిళపై గ్యాంగ్రేప్
హైదరాబాద్ : ఛ్తతీస్గడ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో 26 ఏళ్ల వివాహిత మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిలాస్పూర్ జిల్లాలోని బెల్సారీ గ్రామానకి సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.
బిలాస్పూర్కు చెందిన బాధితురాలు జానక్పూర్లోని తన స్నేహితురాలి దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా రెండు బైకులపై వచ్చిన నలుగురు యువకులు లిఫ్ట్ ఇస్తామని ఆమెను తమ వాహనంపై ఎక్కించుకున్నారు. తర్వాత నిర్మానుష్యమైన ప్రదేశంలోని కాలువలోకి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించారు.
మద్యం తాగించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారని బిలాస్పూర్ ఎఎస్పీ జెఆర్ ఠాకూర్ చెప్పారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ామెను అక్కడే వదిలేసి వారు పారిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన వెలుగు చూసింది. పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బాధితురాలిన తొలుత స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఆ తర్వాత బిలాస్పూర్ ఆస్పత్రికి తరలించారు.