ఏఎస్ఐ ఫ్యామిలీకి అసభ్య సందేశాలు: మహిళ అరెస్ట్

సైబర్ క్రైం బ్రాంచ్ చీఫ్, పోలీస్ ఇన్ స్పెక్టర్ గౌతమ్ పటారే కథనం ప్రకారం.. అసభ్య సందేశాలు పంపిన నిందితురాలి కూతురు కొన్నేళ్ల క్రితం అదృశ్యమైంది. ఆ కేసును విచారించేందుకు సదరు సబ్ ఇన్స్పెక్టర్ విచారణాధికారిగా నియమితులయ్యాడు. విచారణ నిమిత్తం సదరు అధికారి తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో వారికి పరిచయం ఏర్పడింది.
కేసు విచారణ పూర్తయినప్పటికీ ఆమె ఇంటికి ఆ అధికారి వెళ్లేవాడు. ఆమెకు ఓ సెల్ఫోన్ కూడా ఇచ్చాడు. రెండేళ్ల నుంచి వారు తరచూ కలుసుకునేవారు. కాగా, గత కొంతకాలంగా అతడు ఆమెకు దూరంగా ఉండటంతో ఆమె అతనిపై కోపం పెంచుకుంది. దీంతో అతనికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకుంది.
ఈ నేపథ్యంలోని ఆమె పోలీసు అధికారికి అశ్లీల, అసభ్య సందేశాలను పంపడం మొదలుపెట్టింది. ఆ సందేశాలను అతనితోపాటు అతని భార్య, కుమారుడికి కూడా పంపించింది. ఇతర మహిళలతో సంబంధాలున్నట్లు ఉండే సందేశాలను కూడా ఆమె పంపింది. ఏఎస్ఐ ఇచ్చిన ఫోన్ ద్వారానే వివిధ సిమ్ కార్డులతో ఈ సందేశాలను పంపడం గమనార్హం. కాగా, సదరు బాధిత పోలీస్ అధికారి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications