ఐదుగురు పోలీసుల్ని సస్పెండ్ చేసిన యోగీ సర్కార్-ఆగని యూపీ జంట హత్యల ప్రకంపనలు..
యూపీలో నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కు తాజాగా పోలీసు కస్టడీలో చోటు చేసుకున్న మాజీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్ హత్యలు తలనొప్పిగా మారాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నేరస్తుల్ని వరుసగా ఎన్ కౌంటర్లు చేస్తున్న యోగీ సర్కార్ కు.. ఇప్పుడు మాజీ గ్యాంగ్ స్టర్ హత్య చికాకు పెడుతోంది. దీంతో ఈ బహిరంగ హత్యలకు బాధ్యులైన ఐదుగురు పోలీసు అధికారులపై యోగీ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది.
ప్రయాగ్ రాజ్ లో జరిగిన అతీక్, అష్రాఫ్ హత్యల నేపథ్యంలో షాగంజ్ పోలీసు స్టేషన్ కు చెందిన ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. హత్యలు జరిగిన ఎంఎల్ఎన్ మెడికల్ కాలేజ్ ఈ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఉంది. దీంతో ఈ పీఎస్ అధికారుల్ని హత్యలకు బాధ్యుల్ని చేశారు. ఈ హత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించి యోగీ సర్కార్ కు నోటీసులు పంపింది.

బీఎస్పీ నేత ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్లను ఏప్రిల్ 16న ప్రయాగ్రాజ్లో జర్నలిస్టులుగా వేషాలు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు కాల్చిచంపారు. అతిక్, అతని సోదరుడిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన పలువురు పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ హత్య చేసిన ముగ్గురు షూటర్లలో హమీర్పూర్కు చెందిన సన్నీ సింగ్ (23), బండాకు చెందిన లవ్లేష్ తివారీ (22), కాస్గంజ్కు చెందిన అరుణ్ మౌర్య (18)లను ఏప్రిల్ 23 వరకు నాలుగు రోజుల పోలీసు రిమాండ్కు పంపారు.
ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ భార్య షైస్తా పర్వీన్, మరో నిందితుడు గుడ్డు ముస్లింలను పట్టుకోవడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో అదే రోజున పోలీసుల సస్పెన్షన్, షూటర్ల పోలీసు రిమాండ్ విధించడం జరిగాయి. ఉమేష్ పాల్ హత్య ఎఫ్ఐఆర్లో పేర్కొన్న 10మందిలో గుడ్డు ముస్లిం ఒకరు. వీరిలో ఆరుగురు మృతి చెందగా, పరారీలో ఉన్న నలుగురిలో గుడ్డు ముస్లిం ఒకరుగా భావిస్తున్నారు.
-
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications