మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కు యూపీలో భారీ ఏర్పాట్లు-యోగీ కీలక ఆదేశాలు..
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న యూపీలో పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు వీలుగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ ఏడాది తొలకరి జల్లులు మొదలు కాగానే భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. జూలై 1 నుంచి 7వ తేదీ వరకూ వారం రోజుల పాటు రాష్ట్రంలో 35 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.
2027 నాటికి యూపీలో 15 శాతం ప్రాంతానికి హరితంగా మార్చాలని నిర్ణయించిన యోగీ ఆదిత్యనాథ్ సర్కార్.. ఇందులో భాగంగానే ఈ భారీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతోంది. గత ఆరేళ్లలో యోగీ సర్కార్ యూపీలో 131 కోట్ల మొక్కలు నాటింది. ఈ ఏడాది 35 కోట్ల మొక్కలు విజయవంతంగా నాటితో ఈ సంఖ్య 166 కోట్లకు చేరనుంది. తాజాగా వెలువడిన అగ్రోఫారెస్ట్రీ నివేదిక ప్రకారం పండ్లు, కూరగాయల సాగులో ఉత్తరప్రదేశ్ రైతులకు అపారమైన అవకాశాల క్షేత్రంగా మారింది.

మెరుగైన ఆదాయం కోసం మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల సాగును వైవిధ్యపరచాలని రైతులకు యోగి ప్రభుత్వం చేసిన వరుస విజ్ఞప్తులతో పరిస్ధితిలో మార్పు వస్తోంది. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, మినీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లలో అధిక-నాణ్యత గల మొక్కల ఉత్పత్తి, వీటిని రైతులకు కనీస ధరలకు అందించడం; రక్షిత సాగు కోసం నియంత్రిత ఉష్ణోగ్రత మరియు తేమ, మార్కెట్ల ఆధునీకరణ చేపడుతున్నారు.
ఈ నివేదిక ప్రకారం ఈ దశాబ్దంలో దేశంలో పండ్లు,కూరగాయల సాగులో రాష్ట్ర వాటా 7.2 శాతం నుండి 9.2 శాతానికి పెరిగింది. అయితే దాని నుండి పొందిన స్థూల విలువ ఉత్పత్తి (జీవో) రూ.20,600 కోట్ల నుంచి రూ.38,000 కోట్లకు పెరిగినట్లు తేలింది.సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వారి వినియోగం, ప్రాసెసింగ్ యూనిట్ల వృద్ధికి సంబంధించి వారి అపారమైన సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తన తొలి సర్కార్ హయాంలోనే పండ్లు, కూరగాయలను పండించమని రైతులను
ప్రోత్సహిస్తున్నారు.












Click it and Unblock the Notifications