బంగ్లాదేశ్లో బోటు మునక.. 15 మంది రోహింగ్యాల మృతి
రోహింగ్యా శరణార్థులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు బంగాళాఖాతంలో మునిగిపోవడంతో 15 మంది చనిపోయినట్టు బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. దాదాపు 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ బోటు.. సైంట్ మార్టిన్ ఐస్లాండ్ వద్ద మునిగిపోయినట్టు చెప్పారు. ప్రమాదం నుంచి 71 మంది ప్రయాణికులను కాపాడినట్టు చిట్టగాంగ్ డివిజన్ కోస్ట్గార్డ్ కమాండర్,వసీమ్ మక్సూద్ తెలిపారు. మిగతావారు సముద్రంలో గల్లంతు కాగా.. కోస్ట్గార్డ్కి సంబంధించిన ఓ బోటు,రెండు నేవీ ఓడలు ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నాయి.
బోటు ప్రమాదంపై మంగళవారం ఉదయం తమకు సమాచారం అందిందని.. అయితే పూర్తి స్థాయి సమాచారం లేకపోవడంతో.. బోటు ఎక్కడ ఉందో గుర్తించేందుకు చాలా సమయం పట్టిందని మక్సూద్ తెలిపారు.అయితే ఆ బోటు ఎటు వెళ్తుందన్న దానిపై సమాచారం లేదన్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యామని.. అవి పూర్తయ్యాకే మిగతా వివరాలపై దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చారు.

మయన్మార్ సరిహద్దులోని దక్షిణ బంగ్లాదేశ్ పరిధిలో ఉన్న కాక్స్ బజార్,లోని టెక్నాఫ్ నుంచి బోటు బయలుదేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో అక్కడినుంచి వేలాది మంది రోహింగ్యా శరణార్థులు సముద్ర మార్గం మీదుగా వేరే దేశాలకు తరలిపోయారు. కాక్స్ బజార్లో ఉన్న శరణార్థి శిబిరంలో ఇప్పటికీ చాలామంది రోహింగ్యాలు ఉన్నారు. వారిలో కొంతమంది ఇలా సముద్రమార్గం ద్వారా వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications