ALERT: అంతుచిక్కని వ్యాధి.. 48 గంటల్లో 50 మంది మృతి..!

కొవిడ్-19 తర్వాత.. రోజుకో వైరస్ పుట్టుకొస్తోంది. అంతుచిక్కని వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని వాయువ్య ప్రాంతంలో ఓ అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వైరస్ సోకి నెలరోజుల్లోనే 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన 48 గంటల్లోనే ప్రజలు మృతి చెందుతున్నారు. దీంతో వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లల్లో మొదట ఈ వ్యాధిని గుర్తించినట్లు తెలుస్తోంది.

లక్షణాలు ఇవే..

జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం లక్షణాలు ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) అందించిన వివరాల ప్రకారం.. జనవరి 21న కాంగోలో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 16 నాటికి 431 కేసులు నమోదు కాగా 53 మరణాలు సంభవించాయి.

50 Dead in 48 Hours Mysterious Disease Strikes the Democratic Republic of Congo Experts Concerned

వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మరోవైపు ఈ అంతుచిక్కని వ్యాధిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ ఓ ప్రకటనలో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+