వివాహ వేదికపై రాకెట్ దాడి: 28 మంది మృతి, 40మందికిపైగా గాయాలు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమంపై రాకెట్ దాడి జరిగింది ఈ దాడిలో వివాహ బృందానికి చెందిన 28 మంది మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. మరో 40మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులుగా ఉన్నట్లుగా సమాచారం.
ఈ విషాద ఘటన సంగిన్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామమే లక్ష్యంగా మూడు వైపుల నుంచి ఫిరంగులతో దాడి జరిగిందని ఆఫ్ఘనిస్థాన్ 215 కార్ప్స్ ప్రావిన్స్ డిప్యూటీ కమాండర్ జనరల్ మహమౌద్ తెలిపారు.

తమ దేశ సైనికులు మూడు ఔట్ పోస్టుల నుంచి మోర్టార్ రౌండ్స్ దాడులు జరిపారని తెలిపిన ఆయన, అయితే ఈ దాడులు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని చెప్పారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు.
తమ తొమ్మిది మంది పిల్లలు కూడా దాడి జరిగిన తర్వాత కనిపించడం లేదని వరుడి కజిన్ ఒకరు తెలిపారు. కొందరు పిల్లల శరీర భాగాలు చెల్లాచెదురుగా లభించాయని కన్నీటి పర్యాంతమయ్యాడు. అయితే ఆ శరీర భాగాలు తమ పిల్లలవో కాదో తెలియదని అన్నాడు. వివాహ కార్యక్రమానికి వందలాది మంది బంధువులు హాజరయ్యారని చెప్పాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications