వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్: కాబుల్‌ నగరానికి చేరువలో తాలిబన్లు, బలగాలను సమీకరిస్తున్నామన్న దేశాధ్యక్షుడు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అష్రాఫ్ ఘనీ

అఫ్గానిస్తాన్‌పై తాలిబన్ల పట్టు బిగుస్తున్న సమయంలో దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

''హింసతోపాటు పరిస్థితులు మరింత దిగజారకుండా అడ్డుకోవడమే అధ్యక్షుడిగా నా తొలి ప్రాధాన్యం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలస పోతున్న ప్రజలకు అండగా నిలుస్తాం’’అని అఫ్గాన్ ప్రజలకు ఘనీ భరోసా ఇచ్చారు.

''ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతా బలగాలను ఒక చోటకు సమీకరించడంపై మేం దృష్టి సారిస్తున్నాం. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నాం’’అని ఆయన చెప్పారు.

''ఈ యుద్ధం భారం ప్రజలపై పడినివ్వం. మరిన్ని మరణాలు సంభవించకుండా అడ్డుకుంటాం’’అని ఘనీ అన్నారు. నగరాల్లో తాలిబన్లతో ధైర్యంగా పోరాడుతున్న భద్రతా బలగాలను ఆయన ప్రశంసించారు.

రాజీనామా చేస్తారనే వార్తల నడుమ, ఘనీ ప్రజల ముందుకొచ్చి ప్రసంగించారు.

అఫ్గానిస్తాన్

కాబూల్‌కు ఎంత దూరంలో ఉన్నారు?

చాలా ప్రాంతాల్లో భీకర కాల్పుల నడుమ సురక్షితమైన రాజధాని నగరం కాబూల్‌కు ప్రజలు పరుగులు తీస్తున్నారు. మరోవైపు తాలిబన్లు ఒకటి తర్వాత ఒకటిగా అన్ని నగరాలపై పట్టు సాధిస్తున్నారు. ప్రస్తుతం కాబూల్‌కు కూడా వారు చేరువలోనే ఉన్నారు.

కాబూల్ ప్రావిన్స్‌ ప్రధాన గేట్ల దగ్గర తాలిబన్లపై అమెరికా సేనలు వైమానిక దాడులు చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.

కాబూల్ నగరంపై మరో 30 రోజుల్లో తాలిబన్లు పట్టు సాధించే అవకాశముందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గత వారంలో అఫ్గాన్‌లోని చాలా ప్రధాన నగరాలు వరసగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతూ వచ్చాయి.

అఫ్గానిస్తాన్

శుక్రవారం రాత్రి కూడా లోఘార్ ప్రావిన్స్ రాజధాని పుల్-ఏ-ఆలం నగరాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది కాబూల్‌కు కేవలం 80 కి.మీ. దూరంలో ఉంది.

కాబూల్‌కు 40 కిమీ. దూరంలోని మైదాన్ షార్‌ నగరంలోనూ విధ్వంసకర ఘర్షణలు చెలరేగుతున్నాయి.

సగానికిపైగా ప్రావిన్స్‌లలోని రాజధానులు ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ కూడా తాలిబన్ నగరాల జాబితాలో చేరిపోయింది.

అఫ్గాన్‌లో పరిస్థితులు చేజారిపోతున్నాయని, దీని భారం ప్రజలపై పడుతోందని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు.

తాము అధికారంలోకి వస్తే మళ్లీ షరియా చట్టాన్ని అమలు చేస్తామని తాలిబన్ కమాండర్లు బీబీసీతో చెప్పారు. అక్రమ సంబంధాల జోలికి వెళ్తే రాళ్లతో కొట్టడం, దొంగతనం చేస్తే చేతులు నరికేయడం, 12ఏళ్లకుపైబడిన అమ్మాయిలను పాఠశాలలకు వెళ్లకుండా అడ్డుకోవడం తదితర నిబంధనలను వారు ఇదివరకు అమలు చేశారు.

తాలిబన్లు

''ఘనీ రాజీనామా చేయరు’’

తాజా ప్రసంగం అనంతరం ఘనీకి రాజీనామా చేసే ఆలోచన లేదని తెలుస్తోందని అఫ్గాన్‌లోని బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీ అన్నారు.

''తాలిబన్లపై పోరాటానికి భద్రతా బలగాలను మళ్లీ సమీకరించడంపై ఆయన మాట్లాడుతున్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ అర్థంకావడం లేదు.’’

''కాబూల్‌లో చాలా మంది తాలిబన్లను వ్యతిరేకిస్తున్నారు. అయితే తాలిబన్ల చేతుల్లోకి కాబూల్ వెళ్లిపోవడం కంటే, ఇక్కడ జరిగే యుద్ధం గురించే ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు’’అని కిర్మానీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Afghanistan: Taliban mobilize forces near Kabul
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X