సిడ్నీ ఉగ్రదాడిలో సంచలనం.. ఉగ్రవాదికి హైదరాబాద్ లో పాస్ పోర్టు..
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో యూదులపై జరిగిన ఉగ్రదాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడి అనంతరం అధికారులు జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడికి పాల్పడిన ఆ ఉగ్రవాదిని సాజిద్ అక్రమ్ గా అధికారులు గుర్తించారు. అయితే నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద ఇండియా పాస్ పోర్టు లభ్యం అయింది. సాజిద్.. హైదరాబాద్ లో పాస్ పోర్టు పొందినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం యావత్ ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసిన ఘటన ఆస్ట్రేలియాలోని పోండీ బీచ్ మారణహోమం. ఉగ్రమూకలు జరిపిన ఈ నరమేధంలో ఇప్పటివరకూ 16 మంది మృతి చెందినట్లు స్పష్టం అవుతోంది. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. యూదులు ఎంతో ఉత్సాహంగా బీచ్ వద్ద వేడుక జరుపుకుంటున్న సమయంలో ఉగ్రమూకలు కాల్పులకు పాల్పడ్డారు. నలుపు దుస్తులు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు అక్కడకు వచ్చి తుపాకులతో కాల్పులు జరిపారు. దర్యాప్తులో దాడికి పాల్పడింది సాజిద్ అక్రమ్ (50), నవీద్ అక్రమ్ (24) ఇద్దరూ తండ్రీ కొడుకులు అని తేలింది.
అధికారుల విచారణలో సాజిద్ అక్రమ్ వద్ద ఇండియా పాస్ పోర్టు లభ్యం అయింది. సాజిద్ హైదరాబాద్ లో పాస్ పోర్టు పొందినట్లు గుర్తించారు. సాజిద్ అక్రమ్.. 1988లోనే స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లినట్లు సమాచారం. గత పాతికేళ్లలో అతడు రెండుసార్లు హైదరాబాద్ వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్థాన్ వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. హైదరాబాద్ లో ఉగ్ర లింకులు బయటకు రావడంతో భద్రతాదళాలు పూర్తిస్థాయిలో అప్రమత్తం అయ్యాయి.

ఇక ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారయ్యారు. అయితే అహ్మద్ అనే వ్యక్తి మాత్రం తెగించి.. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడారు. దాంతో అహ్మద్ ను యావత్ ప్రపంచం మొత్తం ప్రశంసలతో ముంచెత్తుతోంది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం అహ్మద్ హీరో అంటూ కామెంట్ చేయడం ఆశ్చర్యకరంగా చెప్పవచ్చు.
-
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం












Click it and Unblock the Notifications