నింగిలో చైనా అద్భుతం: 2022 నాటికి ఆకాశంలో కృత్రిమ చంద్రులు

ఆకాశంలో మరో అద్భుతం చేసేందుకు చైనా రంగం సిద్ధం చేస్తోంది. సొంతంగా కృత్రిమ చందమామను సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది 2020 కల్లా పూర్తి చేయాలనే ధృడ నిశ్చయంతో చైనా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ కృత్రిమ చంద్రుడిని ప్రవేశ పెట్టడం ద్వారా వీధి లైట్లకు చెక్ పెట్టి తద్వారా విద్యుత్‌కు అయ్యే ఖర్చును ఆదా చేయాలని భావిస్తోంది డ్రాగన్ కంట్రీ.

చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూ నగరంలో ఈ కృత్రిమ చంద్రులను తయారు చేస్తున్నారు. ఇది సహజ చంద్రుడు ఎంత వెలుగైతే ఇస్తాడో అంతకంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఈ కృత్రిమ చంద్రుడు కాంతిని ఇస్తాడని అధికారులు వెల్లడించారు. మానవుడు తయారు చేసిన తొలి చంద్రుడిని సిచువాన్‌లోని క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి పంపనున్నారు. ఆ తర్వాత 2022 నాటికి మరో మూడు కృత్రిమ చంద్రులను ఆకాశంలోకి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది చైనా.

China to launch man made moonsin space by 2022

మొదటి చంద్రడు కేవలం ప్రయోగం కోసమేనని చెప్పిన శాస్త్రవేత్తలు ఇది విజయవంతం అయితే మరో మూడు చంద్రులను నింగిలోకి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ కృత్రిమ చంద్రుడిని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన తర్వాత సూర్యకాంతి దీనిపై పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక రాత్రి వేళల్లో ఈ చంద్రుడి నుంచి విడుదలయ్యే కాంతితో స్ట్రీట్ లైట్లతో పని ఉండదని చెప్పారు. ఇలా ఊటా 170 మిలియన్ డాలర్లు మేరా విద్యుత్ ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఈ కృత్రిమ చంద్రుడు 50 చదరపు కిలోమీటర్ల మేరా కాంతిని వెదజల్లుతుందని చెప్పారు. అంతేకాదు ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కరెంట్ లేని సమయంలో సహాయక చర్యలు ముందుకు సాగేందుకు ఈ కృత్రిమ చంద్రుడునుంచి విడుదలయ్యే కాంతి ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+