వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: ట్రావెల్ ‘రెడ్‌లిస్ట్’లో భారత్‌ను చేరిన యూకే -విమానాలను నిషేధించిన హాంకాంగ్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రెండో దశ విలయం రోజురోజుకూ ఉధృతం అవుతున్నది. ఈ క్రమంలో ప్రపంచదేశాలన్నీ కఠిన ఆంక్షలకు దిగుతున్నాయి. భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్న నేపథ్యంలో బ్రిటన్, హాంకాంగ్ లాంటి దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి..

కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్

భారత్‌ను ట్రావెల్ 'రెడ్ లిస్ట్'లో చేర్చుతూ బ్రిటన్ ప్రభుత్వం సోమవారం ఆదేశాలిచ్చింది. ఇండియాలో తొలిసారి బయటపడిన కరోనా వేరియంట్‌కు సంబంధించిన 103 కేసులు బ్రిటన్‌లో గుర్తించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం యూకే రావడానికి ముందు ఇండియాలో పది రోజులు ఉన్న యూకే, ఐరిష్, బ్రిటన్ జాతీయులు తప్పనిసరిగా పది రోజులపాటు హోటల్ క్వారంటైన్‌లో ఉండాలి.

covid surge: UK Adds India to Travel ‘Red List’, Hong Kong bans flights from India

భారత్ ప్రయాణాలపై రెడ్ లిస్ట్ జారీ ఆంక్షలు ఈ నెల 24 నుంచి అమల్లోకి వస్తాయని యూకే ప్రభుత్వం పేర్కొంది. ఇక భార‌త్‌లో కొవిడ్ పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్న క్ర‌మంలో హాంకాంగ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి మే 3 వ‌ర‌కు భార‌త్ మీదుగా హాంకాంగ్ వెళ్లే విమానాల‌న్నింటినీ ర‌ద్దు చేసింది.

వ్యాక్సిన్ల కొరత: నిద్ర లేచిన కేంద్రం -సీరం సంస్థకు రూ.3వేల కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500కోట్లు అప్పు, కానీవ్యాక్సిన్ల కొరత: నిద్ర లేచిన కేంద్రం -సీరం సంస్థకు రూ.3వేల కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500కోట్లు అప్పు, కానీ

Recommended Video

COVID-19 Predominantly Spreads Through Air - Lancet Study || Oneindia Telugu

ఇండియాతోపాటు పాకిస్తాన్, ఫిలిఫీన్స్ నుంచి బ‌య‌ల్దేరే విమానాల‌పై కూడా హాంకాంగ్ నిషేధం విధించింది. ఈ నెల‌లో రెండు విస్తారా విమానాల్లో ప్ర‌యాణించిన 50 మంది ప్ర‌యాణికుల‌కు క‌రోనా సోక‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు హాంకాంగ్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ముంబై - హాంకాంగ్ మార్గంలో వెళ్లే విస్తారా విమానాల‌ను మే 3 వ‌ర‌కు నిషేధించింది.

English summary
Britain on Monday imposed its strictest travel curbs on India after a massive surge in COVID-19 cases. Hong Kong will suspend flights from India, Pakistan and the Philippines from April 20 for two weeks after the N501Y mutant COVID-19 strain was detected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X