కరోనా విలయం: ట్రావెల్ ‘రెడ్లిస్ట్’లో భారత్ను చేరిన యూకే -విమానాలను నిషేధించిన హాంకాంగ్
కరోనా వైరస్ రెండో దశ విలయం రోజురోజుకూ ఉధృతం అవుతున్నది. ఈ క్రమంలో ప్రపంచదేశాలన్నీ కఠిన ఆంక్షలకు దిగుతున్నాయి. భారత్లో కరోనా వైరస్ కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్న నేపథ్యంలో బ్రిటన్, హాంకాంగ్ లాంటి దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి..
కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్
భారత్ను ట్రావెల్ 'రెడ్ లిస్ట్'లో చేర్చుతూ బ్రిటన్ ప్రభుత్వం సోమవారం ఆదేశాలిచ్చింది. ఇండియాలో తొలిసారి బయటపడిన కరోనా వేరియంట్కు సంబంధించిన 103 కేసులు బ్రిటన్లో గుర్తించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం యూకే రావడానికి ముందు ఇండియాలో పది రోజులు ఉన్న యూకే, ఐరిష్, బ్రిటన్ జాతీయులు తప్పనిసరిగా పది రోజులపాటు హోటల్ క్వారంటైన్లో ఉండాలి.
భారత్ ప్రయాణాలపై రెడ్ లిస్ట్ జారీ ఆంక్షలు ఈ నెల 24 నుంచి అమల్లోకి వస్తాయని యూకే ప్రభుత్వం పేర్కొంది. ఇక భారత్లో కొవిడ్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి మే 3 వరకు భారత్ మీదుగా హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ రద్దు చేసింది.
Recommended Video
ఇండియాతోపాటు పాకిస్తాన్, ఫిలిఫీన్స్ నుంచి బయల్దేరే విమానాలపై కూడా హాంకాంగ్ నిషేధం విధించింది. ఈ నెలలో రెండు విస్తారా విమానాల్లో ప్రయాణించిన 50 మంది ప్రయాణికులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. ముంబై - హాంకాంగ్ మార్గంలో వెళ్లే విస్తారా విమానాలను మే 3 వరకు నిషేధించింది.