'ఇంటర్నెట్ వాడకం ఐసిస్ ఉగ్రవాదులకే బాగా తెలుసు'
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల అదుపులో ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఉండకుండా చేయాలని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే మంచిదని అతను అభిప్రాయపడ్డాడు.
సామాజిక అనుసంధాన వేదికలను (సోషల్ మీడియా) ఉపయోగించుకొని యువతను ఐసిస్ తమ వైపుకు తిప్పుకుంటోందని, కాబట్టి ఇంటర్నెట్ సేవలను ఉగ్రవాదుల అదుపులో ఉన్న ప్రాంతాలలో రద్దు నిలిపేయాలన్నారు.

మనల్ని, మన దేశాన్ని నాశనం చేయాలనుకునే ఉగ్రవాదులు ఇంటర్నెట్ వాడుతున్నారన్న విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. సామాన్య పౌరుల కంటే కూడా ఇస్లామిక్ మిలిటెంట్లు ఇంటర్నెట్ సేవలను బాగా వినియోగించుకుంటారన్నారు.
సాంకేతికతను వాడి ఐసిస్ ఉగ్రవాదులు ఎప్పుడు, ఎక్కడ ఉంటుంది, వారు ఎటువంటి చర్యలకు పాల్పడనున్నారో.. అలాంటి విషయాలను ముందుగానే గుర్తించాలన్నారు. ఐసిస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇరాక్, సిరియాలలో మాత్రమే ఇంటర్నెట్ సేవలు నిషేధించాలని మాత్రమే తాను చెబుతున్నానన్నారు.












Click it and Unblock the Notifications