భూకంప భయం.. జైలు నుంచి 200 మందికి పైగా ఖైదీలు జంప్..!
భూకంప భయంతో జైలు నుంచి 200 మందికి పైగా ఖైదీలు జంప్ అయినట్లు సమాచారం. ఈ ఘటన పాకిస్థాన్ కరాచీలోని మాలిర్ జిల్లాలో జరిగింది. సోమవారం రాత్రి జైలు ప్రాంతంలో భూమి కంపించింది. దీంతో అక్కడి అధికారులు, ఖైదీలు,సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఈ సమయంలోనే ఖైదీలు జైలు నుంచి బయటపడ్డారు.
కరాచీ ప్రావిన్స్ లోని మాలిర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. సోమవారం రాత్రి భూకంపంతో జైలు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు బీభత్స వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో జైలు నుంచి 200 మందికిపైగా ఖైదీలు జంప్ అయినట్లు సమాచారం. పరారైన ఖైదీల్లో హై ప్రొఫైల్ క్రిమినల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కొంతమంది ఖైదీలు జైలు అధికారులు, సిబ్బందిపై దాడి చేసి మరీ జంప్ అయినట్లు తెలుస్తోంది.

ఖైదీల పరారీతో కరాచీ ప్రాంతం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. మాలిర్ ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించడంతో ఒక్కసారిగా జైలులోని 700 నుంచి 1000 మంది వరకు సిబ్బంది మెయిన్ గేట్ వద్దకు గుమిగూడారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో దాదాపు 216 మంది ఖైదీలు జైలు నుంచి జంప్ అయ్యారు. వీరిలో సీనియర్ కిల్లర్స్ కూడా ఉన్నట్లు సమాచారం.
Prison break in Karachi Pakistan, 250 to 300 Inmates have fled from Jail. They were seen on the street and there was firing later on. pic.twitter.com/QUyHbS2kCO
— Vikrant (@Vikspeaks1) June 3, 2025
ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటనతో కరాచీ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. పరారైన ఖైదీల కోసం జైలు అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై సింధ్ ప్రావిన్స్ హోం మంత్రి స్పందించారు. ఖైదీలు మెయిన్ గేట్ ధ్వంసం చేసి పరారైనట్లు పేర్కొన్నారు. జైలు గోడలు బద్దలు కొట్టలేదని అన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications