అలెర్ట్: ఈనెల 8న భూమికి ముప్పు -అదుపుతప్పి దూసుకొస్తున్న చైనా రాకెట్ -ఎక్కడ పడుతుందో తెలీదు..
కరోనా పుట్టినిల్లు చైనా మరో రకంగానూ ప్రపంచాన్ని వణికిస్తున్నది. అక్కడి వూహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం అన్ని దేశాలనూ కబళించి, ఏకంగా 33 లక్షల మందిని పొట్టనపెట్టుకోవడం తెలిసిందే. ఇప్పటికే 16కోట్లకు చేరువైన ఇన్ఫెక్షన్ల సంఖ్య అంతులేకుండా పెరుగుతూనే ఉన్నది. కొవిడ్ విలయం నుంచి తేరుకోకముందే డ్రాగన్ చైనా ప్రపంచం నెత్తిన మరో పిడుగు పడేసింది..
Recommended Video
దూసుకొస్తోన్న చైనా రాకెట్..
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్, అమెరికాకు దీటుగా ప్రయోగాలు చేస్తోన్న చైనా సరైన ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు గతం నుంచీ ఉన్నాయి. ఆ ఆరోపణలు వాస్తవమే అనడానికి రుజువుగా ప్రస్తుతం ఓ విపత్కర పరిస్థితి తలెత్తింది. చైనా అంతరిక్షంలోకి పంపిన ఓ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమివైపు దూసుకొస్తోంది. అది ఏ క్షణమైనా భూమిని తాకొచ్చని సైంటిస్టులు చెప్పారు. సాధారణంగా కూలిపోయిన రాకెట్లు సముద్రంలో పడుతుంటాయి. కానీ..
ఈనెల 8న ఎక్కడ పడుతుందో..
నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా చైనా ప్రయోగించిన 'లాంగ్ మార్చ్ 5బీ రాకెట్' బెడిసికొట్టింది. అది సముద్రలో కాకుండా నేరుగా భూతలంపైనే పడబోతున్నది. అది ఎక్కడ పడుతుందో ప్రస్తుతానికి చెప్పలేమని సైంటిస్టులు అంటున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్ ప్రస్తుతం లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ రాకెట్ నెల 8న రాకెట్ భూమ్మీదకు వచ్చే అవకాశం ఉందని పెంటగాన్ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూ వాతవరణంలోకి ప్రవేశిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు.
డ్రాగన్ బాధ్యతారాహిత్యం..
అంతర్జాతీయ
స్పేస్
స్టేషన్
కు
విడిగా
అంతరిక్షంలో
సొంత
కేంద్రాన్ని
ఏర్పాటు
చేయాలనుకుంటోన్న
చైనా
ఆ
దిశగా
ప్రయత్నాలను
ముమ్మరం
చేసింది.
ఈ
నేపథ్యంలో
అంతరిక్షంలో
స్పేస్
స్టేషన్
నిర్మించడం
కోసం
లాంగ్మార్చ్
5బీ
రాకెట్
తియాన్హే
స్పేస్
మ్యాడుల్ను
అంతరిక్షంలోని
300
కిలోమీటర్ల
ఎత్తున
కక్ష్యలోకి
చేర్చింది.
సుమారు
21
టన్నుల
బరువున్న
ఆ
రాకెట్
మొదటి
మాడ్యూల్
విడుదలలో
లోపాలు
తలెత్తి
నియంత్రణ
కోల్పోయింది.
ఇప్పుడా
రాకెట్
శకలాలు
భూమి
మీదకు
దూసుకొస్తున్నాయి.
స్పేస్
లో
నిర్దేశిత
ప్రమాణాలను
చైనా
పాటించని
కారణంగానే
ఈ
విలయం
తలెత్తిందని
అమెరికా
ఆరోపిస్తున్నది.