Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

160 మంది బాలికలను ఒకే చోట సమాధి

పశ్చిమ ఆసియాలో మృత్యుఘోష మిన్నంటుతోంది. యుద్ధం పేరుతో సాగుతున్న మారణకాండలో చిగురుటాకుల వంటి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఒక బాలికల పాఠశాల లక్ష్యంగా జరిగిన వైమానిక దాడి, మానవత్వాన్ని నిలువునా దహించివేసింది. చదువుకోవాల్సిన పుస్తకాల సంచులు, పాఠశాల ప్రాంగణంలో చిందరవందరగా పడి ఉన్న శిథిలాలు.. ఆ చిన్నారుల కలలు ఎలా కాలిబూడిదయ్యాయో మౌనంగా సాక్ష్యం చెబుతున్నాయి.

"గాజా నుండి మినాబ్ వరకు.. అమాయకులను ఘాతుకంగా హత్య చేశారు" అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి చేసిన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో భాగంగా మినాబ్ నగరంలోని ఒక బాలికల పాఠశాలపై బాంబులు కురిశాయి. ఈ దాడిలో సుమారు 160 మందికి పైగా విద్యార్థినులు మరణించగా, వారి శరీరాలు తునాతునకలయ్యాయి. చదువుల తల్లి నిలయం కాస్తా.. క్షణాల్లో మాంసపు ముద్దలు, రక్తపు మడుగులతో నిండిన నరకకూపంగా మారిపోయింది.

Heartbreaking Images of Mass Graves Iran Foreign Minister Condemns Brutal Attack on Minab Girls School

హృదయాన్ని కలిచివేస్తున్న సమాధుల దృశ్యం

అరగ్చి పంచుకున్న ఒక చిత్రం ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. మైదానం నిండా కొత్తగా తవ్విన సమాధులు, వాటి పక్కన కూర్చుని గుండెలవిసేలా విలపిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు.. ఆ దృశ్యం యుద్ధం ఎంతటి దారుణమైనదో గుర్తు చేస్తోంది. తెల్లటి సుద్దతో గీసిన ఆ దీర్ఘచతురస్రాలు కేవలం ఖననం చేసే ప్లాట్లు కావు, అవి ఆరిపోయిన 160 దీపాలకు నివాళులు. "ఇది ఇజ్రాయెల్ వాగ్దానం చేసిన 'రక్షణ' నిజరూపం" అంటూ అరగ్చి ఆవేదన వ్యక్తం చేశారు.

శిథిలాల కింద పుస్తకాలు.. రక్తం చిందిన క్లాస్ రూములు

అంతర్జాతీయ మీడియా వెల్లడించిన వీడియోలలో రెస్క్యూ సిబ్బంది కూలిన కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తూ చిన్నారుల మృతదేహాల కోసం వెతుకుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కాలిన గోడల మధ్య ఎక్కడో ఒకచోట కనిపించే స్కూల్ బ్యాగులు, చిరిగిన పుస్తకాలు ఆ పాఠశాలలోని నిశ్శబ్దాన్ని భయపెడుతున్నాయి. ఇరాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, దాడి జరిగిన సమయంలో పాఠశాల విద్యార్థినులతో నిండి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం 150 మందికి పైగా మరణించగా, మరో 60 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.

యుద్ధ నీతి ఎక్కడ?

ఈ దాడిపై ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. పౌర మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా పాఠశాలను లక్ష్యం చేసుకోవడం 'యుద్ధ నేరం' (War Crime) అని, దీనిని మానవత్వానికి వ్యతిరేక నేరంగా పరిగణించాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం పాఠశాలలు, ఆసుపత్రులు వంటి వాటిపై దాడులు చేయకూడదు. ఒకవేళ పొరపాటున పౌర నష్టం జరిగినా, అది సైనిక ప్రయోజనం కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ ఇక్కడ వందలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అమెరికా-ఇజ్రాయెల్ వివరణ

పాఠశాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ ధృవీకరించలేదు. పౌరుల నష్టం జరిగినట్లు వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్నామని US సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, సమీపంలోని IRGC స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఈ ఘోరం జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగానే జరిగిందా? అనేది తేలాల్సి ఉంది. కారణం ఏదైనా, యుద్ధం తెలియని ఆ పసిపాపల ప్రాణాలు తిరిగి రావన్నది చేదు నిజం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+