పాకిస్థాన్లో పోలీస్ అధికారిగా తొలి హిందూ యువతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో తొలిసారి ఓ హిందూ యువతి పోలీస్ అధికారిగా ఉద్యోగంలో చేరారు. సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన పుష్ఫా కొల్హి అనే యువతి ఏఎస్సైగా ఎంపికైంది. కాగా, ఆ దేశంలో ఏఎస్సైగా నియమితులైన తొలి హిందూ యువతిగా ఆమె రికార్డు సృష్టించింది.
సింధ్ ప్రావిన్స్లో పుష్ఫా కొల్హికి పోస్టింగ్ ఇచ్చినట్లు జియో న్యూస్ తన కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని మానవ హక్కుల కార్యకర్త కపిల్ దేవ్ ట్విట్టర్లో తెలియజేశారు. గత జనవరిలో హిందూ సామాజిక వర్గానికి చెందిన సుమన్ పవన్ బోదాని సివిల్ మెజిస్ట్రేట్గా నియమితుయ్యారు.

కాగా, పాకిస్థాన్లో హిందువులు అతిపెద్ద మైనార్టీ కమ్యూనిటీగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం.. పాకిస్థాన్లో మొత్తం 75లక్షల మంది హిందువులు ఉన్నారు. అయితే, అనధికారికంగా ఈ సంఖ్య 90లక్షల వరకు ఉందని సమాచారం. కాగా, పాక్ ప్రభుత్వాల తీరుతో ఆ దేశంలోని మైనార్టీలకు రక్షణ లేకుండా పోతోంది.
భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత ఆ దేశ జనాభాలో పావు శాతానికిపైగా ఉన్న హిందువుల సంఖ్య.. క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. హిందువులను బలవంతంగా మతం మార్చడం, హత్యలు, హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్లి మతం మార్చి పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలతో హిందువుల సంఖ్య మరింతగా తగ్గిపోయింది. విభజన తర్వాత సుమారు 26శాతంగా ఉన్న హిందువుల సంఖ్య.. ఇప్పుడు ఆ దేశంలో 10శాతం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications