పాకిస్తాన్‌ను ఓడించిన భారత్.. హాకీ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో కాంస్య పతకం కైవసం

హాకీ: ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఓడించిన భారత్

ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి భారత జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెమీస్‌లో భారత్‌ జట్టు జపాన్‌ చేతిలో ఓడిపోయింది. అయితే మూడో స్థానం కోసం భారత్-పాక్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 4-3తో పాకిస్తాన్ పై గెలిచింది.

హాకీ: ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఓడించిన భారత్

పెనాల్టీ కార్నర్‌ ద్వారా హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు తొలి గోల్ అందించారు. అయితే, ఆ వెంటనే పాకిస్తాన్ గోల్ చేయడంతో స్కోర్ సమం అయ్యింది. మొదటి హాఫ్ వరకు స్కోరు 1-1 కొనసాగింది. రెండో హాఫ్‌లో పాక్‌ గోల్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్లడంతో స్కోరు 2-1కు చేరింది. తర్వాత భారత్ కూడా ఒక గోల్ చేసి స్కోరును సమం చేసింది. చివరి క్వార్టర్‌లో భారత్‌ రెండు గోల్స్‌ చేయగా, పాకిస్తాన్‌ ఒక గోల్‌ చేసింది. దీంతో భారత్ 4-3 తేడాతో విజయం సాధించింది.

https://twitter.com/PBNS_India/status/1473618104307437575

గ్రూప్‌ మ్యాచ్‌లో కూడా పాకిస్తాన్ పై భారత జట్టు విజయం సాధించింది. మరోవైపు జపాన్ గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయింది. అయితే సెమీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+