పాకిస్తాన్ను ఓడించిన భారత్.. హాకీ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో కాంస్య పతకం కైవసం

ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించి భారత జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెమీస్లో భారత్ జట్టు జపాన్ చేతిలో ఓడిపోయింది. అయితే మూడో స్థానం కోసం భారత్-పాక్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ మ్యాచ్లో భారత్ 4-3తో పాకిస్తాన్ పై గెలిచింది.

పెనాల్టీ కార్నర్ ద్వారా హర్మన్ప్రీత్ సింగ్ భారత్కు తొలి గోల్ అందించారు. అయితే, ఆ వెంటనే పాకిస్తాన్ గోల్ చేయడంతో స్కోర్ సమం అయ్యింది. మొదటి హాఫ్ వరకు స్కోరు 1-1 కొనసాగింది. రెండో హాఫ్లో పాక్ గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లడంతో స్కోరు 2-1కు చేరింది. తర్వాత భారత్ కూడా ఒక గోల్ చేసి స్కోరును సమం చేసింది. చివరి క్వార్టర్లో భారత్ రెండు గోల్స్ చేయగా, పాకిస్తాన్ ఒక గోల్ చేసింది. దీంతో భారత్ 4-3 తేడాతో విజయం సాధించింది.
https://twitter.com/PBNS_India/status/1473618104307437575
గ్రూప్ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ పై భారత జట్టు విజయం సాధించింది. మరోవైపు జపాన్ గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయింది. అయితే సెమీ ఫైనల్లో భారత్ను ఓడించింది.
ఇవి కూడా చదవండి:
- ఫొటోలు: భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించిన అపూర్వ క్షణాలివి
- ఓ రోజు కూలీ బిడ్డ.. ఇప్పుడు భారత హాకీ ఛాంపియన్
- ఈ అమ్మాయిలు మాట్లాడటానికే భయపడేవారు.. కానీ ఒలింపిక్స్కు ఎలా అర్హత సాధించారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications