సంచలనం: ఆ దేశానికి రాజుగా మన భారతీయ యువకుడు!
బిర్ తావిల్: నేనే రాజు.. నేనే మంత్రి సినిమా ఇన్స్పిరేషనో ఏమో తెలియదుగానీ.. ఓ భారతీయ యువ వ్యాపారవేత్త ఓ వివాదాస్పద ప్రాంతంలోకి వెళ్లి తనను తానే ఆ ప్రాంతానికి రాజుగా ప్రకటించుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే... ఈజిప్టు, సుడాన్ దేశాల సరిహద్దుల నడుమ 2060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న కొంత భూభాగం వివాదాస్పదంగా మారింది. ఆ ప్రాంతం తమది కాదంటే తమది కాదంటూ రెండు దేశాలు పరస్పరం వాదించుకుంటున్నాయి.
అది ఉగ్రవాదులు సంచరించే ప్రాంతం కావడంతో రెండు దేశాలు ఆప్రదేశంపై వెనక్కి తగ్గాయి. ఇదే అదనుగా ఇండోర్కు చెందిన యువ పారిశ్రామిక వేత్త సుయాష్ దీక్షిత్(24) కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి బిర్తావిల్కు చేరుకున్నాడు.

ఆ వివాదాస్పద ప్రాంతంలో జెండా పాతాడు. ఆ ప్రదేశానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఆ ప్రాంతానికి 'కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్' అని పేరు కూడా పెట్టకున్నాడు.
అంతటితో ఊరుకోలేదు. అక్కడ ఓ విత్తనం నాటి నీరు కూడా పోశాడు. ఇక నుంచి ఈ ప్రాంతానికి రాజును నేనేనంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆ దేశానికి అధ్యక్షుడిగా తన తండ్రి పేరు ప్రకటించాడు.
'హ్యాపీ బర్త్డే పప్పా..' అంటూ తన వాల్పై రాసుకున్నాడు. అనంతరం 'కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్'ను దేశంగా పరిగణించాలంటూ ఐక్యరాజ్యసమితికి ఆన్లైన్లో ఓదరఖాస్తు కూడా పెట్టుకున్నాడు. ఇప్పటి వరకూ తనకు 800 మంది మద్దతు పలికారని అతడు పేర్కొన్నాడు.
ఇవీ కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్ వివరాలు...
దేశం పేరు: కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్, జెండా: పైన చిత్రంలో కనిపిస్తోంది. ప్రస్తుత జనాభా: 1
రాజధాని: సుయాష్పూర్, పాలకుడు: సుయాష్ రాజు, ఏర్పాటు తేది: నవంబర్ 5, 2017
కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్ జాతీయ జంతువు: బల్లి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications