మతిమరుపు: భారతీయుడ్ని ఫేస్బుక్ కలిపింది

దాదాపు 8 వేల మంది అతడి ఫొటోను షేర్ చేసారు. దీంతో ఎట్టకేలకు అతన్ని గుర్తుపట్టగలిగారు. అక్టోబర్లో గుణశేఖరన్ను గమనించిన రాయబార కార్యాలయం అధికారులను అతడ్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే అతని మెదడులో కణతి ఉందని, మతిమరుపుతో బాధపడుతున్నాడని గుర్తించారు. దీంతో అతడు ఎవరనేది భారత రాయబార కార్యాలయానికి అంతు చిక్కలేదు.
సౌదీ ప్రభుత్వం క్షమాభిక్, పథకం అమలులో ఉన్నా గుణశేఖరన్కు ఏమీ తెలియకపోవడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. దీంతో భారత రాయబార కార్యాలయ వర్గాలు తమిళ సంఘాలను సంప్రదించింది. దీంతో ఓ సంస్థ ఫేస్బుక్ ద్వారా అతడి వివరాలు తెలుసుకుంది. అతడి పాస్పోర్టు, వీసా కాపీలు అతని భార్య వద్ద ఉన్నాయి. వాటి అధారంగా భారత అధికారులు సంప్రదించారు.
భారత రాయబార కార్యాలయం వాళ్లే అతడి చికిత్స ఖర్చులు భరించారు. గుణశేఖరన్ను చెన్నైకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications