సంచలనం: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ దంపతులు టాప్ లెస్ ఫోటోలు ప్రచురించిన మేగజైన్
సంచలనం సృష్టించిన బ్రిటన్ యువరాజు భార్య కేట్ మిడిల్టన్ టాప్ లెస్ ఫోటోల వ్యవహరాం ఫ్రెంచ్ కోర్టు విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు జర్నలిస్టులను మంగళవారం నాడు ప్రశ్నించింది.
పారిస్: సంచలనం సృష్టించిన బ్రిటన్ యువరాజు భార్య కేట్ మిడిల్టన్ టాప్ లెస్ ఫోటోల వ్యవహరాం ఫ్రెంచ్ కోర్టు విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు జర్నలిస్టులను మంగళవారం నాడు ప్రశ్నించింది.
ఐదేళ్ళక్రితం ప్రిన్స్ దంపతులు దక్షిణ ఫ్రాన్స్ లో ఓ ఫాంహౌస్ లో విడిదిచేశారు. అనుమతిలేకుండా మూడో వ్యక్తికి అక్కడ ప్రవేశం లేదు.అయితే కేట్ మిడిల్టన్ టాప్ లెస్ గా భర్తతో కలిసి సన్ బాత్ చేయగా ఫోటోలు తీసి ఫ్రెంచ్ మేగజైన్ పేపర్ క్లోజర్ లో 2012 సెప్టెంబర్ లో ప్రచురించారు.

తమ పరువుకు భంగం వాటిల్లే విధంగా పోటోలు ప్రచురించిన మ్యాగజైన్ పై 1.5 మిలియన్ యూరోలను చెల్లించాలని బ్రిటన్ రాకుమారుడు విలియం దంపతులు దావా వేశారు.పత్రికల మొదటిపేజీలో ప్రచురించి బ్రిటన్ రాచకుటుంబం పరువు తీశారన్న కేట్ మిడిల్టన్ తరపు న్యాయవాదుల వాదనకు కోర్టు గత ఏడాది మొగ్గుచూపింది.
టాప్ లెస్ ఫోటోలు ప్రచురించిన క్లోజర్ మేగజైన్ కు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై విచారణ చేపట్టింది. ఆ టాప్ లెస్ ఫోటోలు ఇప్పటికే యూరోపియన్ పబ్లికేషన్స్ అయిన ఇటలీలో చే, స్వీడన్ , డెన్మార్క్ లలో డైలీ స్టార్, సిస్టర్ మేగజైన్స్ లలో ప్రచురించారు.
దీంతో ప్రిన్స్ దంపతులు న్యాయపోరాటాన్ని ఉధృతం చేశారు. క్లోజర్ మేగజైన్ ఎడిటర్ లారెన్స్ పియు, ఓ సీనియర్ జర్నలిస్టు, ఇద్దరు ఫోటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్టులపై విచారణ సాగుతోంది.
1997 లో కేట్ అత్త దివంగత ప్రిన్సెస్ డయానా మీడియా నుండి తప్పించుకొనే క్రమంలోనే ప్రమాదానికి గురై మరణించడంతో ఆ రాజకుటుంబానికి జర్నలిస్టులపై ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. కేట్ మిడిల్టన్ ఫోటోలు వారి అన్యోన్యతను మాత్రమే తెలుపుతుండగా, దీనిపై పరువునష్టం దావా వేశారని లాయర్ పాల్ అల్బర్ట్ ఐయిన్స్ చెప్పారు.
తమ ఫోటో జర్నలిస్టులు నేరుగా ఈ పోటోలు తీయలేదని, ఇతర వ్యక్తుల ద్వారా సంపాదించిన ఫోటోలను మాత్రమే పబ్లిష్ చేశామని క్లోజర్ మేగజైన్ వివరణ ఇచ్చింది.కానీ, మేగజైన్ వివరణతో కోర్టు సంతృప్తి చెందలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications