యూఎస్ స్కూల్లో కాల్పులు: ఇద్దరు మృతి, 17మందికి గాయాలు
వాషింగ్టన్: అమెరికాలోని ఓ పాఠశాలలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కెంటకీ రాష్ట్రంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఓ ఆగంతకుడు చొరబడి విద్యార్థులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో 17మంది తీవ్రగాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాఠశాలను చుట్టుముట్టి పారిపోయిందేకు ప్రయత్నించిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. నిందితుడ్ని పోలీసులు విచారిస్తున్నారు.

కాగా, 2018లో అమెరికాలో జరిగిన తొలిదాడి ఇదేనని పోలీసులు తెలిపారు. కాల్పుల ధాటికి కొందరు విద్యార్థులు సమీపంలోని పొలాల్లోకి పరుగులు తీశారని, మరికొందరు వాహనాల్లో దాక్కున్నారని పోలీసులు చెప్పారు.
గాయపడిన విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దాడి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కెంటకీ గవర్నర్ మాట్ బెవిన్.. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications