వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాలో బాంబు పేలుడు, 18 మంది మృతి: మృతులంతా విద్యార్థులే

|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యాలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో పది మందికి పైగా గాయపడ్డారు. రష్యాలోని కెర్చ్‌.. క్రెమియా టెక్నికల్ కాలేజీలో చోటు చేసుకుంది. సంఘటన జరిగిన ప్రాంతం రష్యా బ్రిడ్జి నిర్మించిన క్రెమియా - రష్యా మధ్య ఉంది.

<strong>విస్తుపోయారు: చనిపోయిన వ్యక్తి పేరిట అకౌంట్లు, ఖాతాలో రూ.460 కోట్లు</strong>విస్తుపోయారు: చనిపోయిన వ్యక్తి పేరిట అకౌంట్లు, ఖాతాలో రూ.460 కోట్లు

తొలుత దీనిని గ్యాస్‌ సిలిండర్‌ పేలుడుగా భావించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా పేలుడుకి పాల్పడినట్లు రష్యాకు చేందిన నేషనల్‌ గార్డ్స్‌ ఆ తర్వాత ప్రకటించింది. పేలుడుపై అధికార ప్రతినిధి మాట్లాడారు. ఇది ఐఈడీ కారణంగా జరిగిన పేలుడుగా గుర్తించామని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామన్నారు.

Kerch blast: Crimea college bomb attack kills 18

ఈ పేలుడు కారణంగా మృతి చెందిన వారిలో అత్యధిక మంది విద్యార్థులే. గుర్తుతెలియని సాయుధుడు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర విభాగాలు వెంటనే అక్కడకు తరలి వచ్చాయి.

English summary
At least 18 people have been killed and dozens more wounded in an explosion at a college in Russian-annexed Crimea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X