ఆ రెండు దేశాలకు అణ్వాయుధాలు: కిమ్ ప్లాన్తో అమెరికాను వెంటాడుతున్న భయం
ఎమిలీ లాండ్యూ అనే మహిళా పరిశోధకురాలు ఈ విషయాలను మీడియాకు వెల్లడించింది.
వాషింగ్టన్: దౌత్య పరంగా ఉత్తరకొరియాను ఏకాకిని చేయడం ద్వారా ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అగ్రరాజ్యం అమెరికా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఐరాస ఒత్తిడి మేరకు చైనాతో ఆ దేశానికి ఉత్పత్తి సంబంధాలు నిలిచిపోయాయి.
మరోవైపు పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ కూడా అమెరికా వైపు నిలబడటంతో.. ఎగుమతులు, దిగుమతులు లేక ఉత్తరకొరియా విలవిల్లాడుతోంది. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి అణు ఆయుధాలను అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని చూస్తోంది.
ఎమిలీ లాండ్యూ అనే ఓ పరిశోధకురాలు ఈ విషయాలు వెల్లడించారు. సిరియా, ఇరాన్ లకు అణ్వాయుధాలు విక్రయించడం ద్వారా ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవాలని ఉత్తరకొరియా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇదే విషయమై ప్రస్తుతం ఆ రెండు దేశాలతో ఉత్తకొరియా చర్చలు జరుపుతోందని అన్నారు. ఈ చర్యలన్ని పరోక్షంగా అమెరికాను టార్గెట్ చేసినవే అని ఆమె పేర్కొనడం గమనార్హం.
అణు ఆయుధాల అమ్మకాలకు ఉత్తరకొరియా సిద్దపడుతోంది కాబట్టే.. రెండు రోజుల క్రితం రహస్యంగా తమ సైనిక స్థావరానికి వెళ్లిన కిమ్.. మరిన్ని అణు ఆయుధాల తయారీకి ఆదేశాలిచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కిమ్ వైఖరితో అమెరికాకు మున్ముందు గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు.
Recommended Video
అందుకు సిద్దంగా లేము, ఉ.కొరియాపై ఆంక్షలు ఎత్తేయండి: చైనాతో ఆ వ్యూహానికి తూట్లు?