మృత్యువుకు 30 సెకన్ల దూరం! ఒకే ఒక్క మెసేజ్ 8 మంది ప్రాణాలు కాపాడింది

ప్రకృతి కోపానికి నేపాల్‌లోని రసువా జిల్లా విలవిలలాడింది. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో అనూహ్యంగా విరుచుకుపడిన మెరుపు పూరలు, బురద, కొండచరియల విధ్వంసంలో వందలాది మంది చిక్కుకున్నారు. అయితే, భంగే ఝర్నా సమీపంలో వంతెన నిర్మాణ పనుల్లో ఉన్న ఎనిమిది మంది శ్రామికులను ఒక ఏకైక ఎస్ఎమ్‌ఎస్ (SMS) రూపంలో వచ్చిన ప్రమాద హెచ్చరిక మృత్యుముఖం నుంచి కాపాడింది. మృత్యువు విరుచుకుపడటానికి సరిగ్గా 30 సెకన్ల ముందు వచ్చిన ఆ అలర్ట్, ఎనిమిది మంది ప్రాణాలను నిలబెట్టిన ఒక అద్భుతంలా మారింది.

'ఫోన్ చూశా.. కళ్లు ఎత్తేసరికి 10 అడుగుల నీటి గోడ!'

మెయిలుంగ్ ప్రాంతంలో నిర్మాణ బృందంతో కలిసి పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడు అర్జున్ రెమాల్ తన అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆయన ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద నిర్మూలన సంస్థ నుంచి వచ్చిన ఆ మెసేజ్‌లో "క్షణాల్లో ఉప్పెన రాబోతోంది, సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి" అని ఉంది. "నేను ఫోన్ వంక చూసి, అలా తల పైకెత్తేసరికి నా కళ్లముందు 10 అడుగుల ఎత్తున బురద, రాళ్లతో కూడిన భయంకరమైన నీటి ప్రవాహం దూసుకొస్తోంది. 'పరుగెత్తండి' అని గట్టిగా అరిచి, ఉన్నపళంగా వెనక్కి తిరక్కుండా పరుగెత్తాను. నేను నా జీవితంలో అంత వేగంగా ఎప్పుడూ పరుగెత్తలేదు. ఆ ఫోన్ చూడటం ఒక్క 30 సెకన్లు లేట్ అయినా.. ఈరోజు మేం ప్రాణాలతో ఉండేవాళ్లం కాము" అని అర్జున్ వివరించారు.

Miraculous Escape in Nepal How an Emergency SMS Warning Saved Eight Workers 30 Seconds Before Flood
Nepal Floods: నేపాల్ లో వరదలు.. 600 కు చేరువలో మృతుల సంఖ్య..!
Nepal Floods: నేపాల్ లో వరదలు.. 600 కు చేరువలో మృతుల సంఖ్య..!

చీకట్లో కొండలు దాటుతూ.. ప్రాణభయంతో రాత్రంతా ప్రయాణం

వరద ఉద్ధృతికి వంతెన కొట్టుకుపోగా, పరుగెత్తే క్రమంలో అర్జున్ తన చెప్పులు, ఫోన్, సొంత వస్తువులన్నీ కోల్పోయారు. కానీ తనతో ఉన్న ఎనిమిది మంది శ్రామికుల ప్రాణాలు కాపాడటమే ఆయనకు ముఖ్యమైంది. రాత్రి కాగానే కింద సముద్రంలా మారిన నది వైపు వెళ్లేదారి లేక, శ్రామికులంతా చుట్టూ ఉన్న కొండలు, దట్టమైన అడవుల గుండా చీకట్లోనే నడుచుకుంటూ వెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో కొన్ని ఇళ్లను చూసి, తాము నువాకోట్ జిల్లాలోకి వచ్చామని గుర్తించారు. అక్కడే కొద్దిగా ఆహారం తీసుకుని విశ్రాంతి లేకుండా సురక్షిత ప్రాంతానికి పయనమయ్యారు.

మీ సాయం మాకొద్దు! భారత్ సహా విదేశీ సైన్యాల ఆపరేషన్లకు నేపాల్ నో
మీ సాయం మాకొద్దు! భారత్ సహా విదేశీ సైన్యాల ఆపరేషన్లకు నేపాల్ నో

ఆర్మీ క్యాంపునకు చేరుకుని ఊపిరిపీల్చుకున్న శ్రామికులు

మరుసటి రోజు గురువారం మధ్యాహ్నానికి వారంతా నేపాల్ ఆర్మీ ఏర్పాటు చేసిన బిదూర్ రెస్క్యూ బేస్‌కు చేరుకున్నారు. ఆర్మీ క్యాంప్ వద్ద తమ కుటుంబ సభ్యుల కోసం కన్నీళ్లతో వెతుకుతున్న బాధితులను చూసి అర్జున్ కలచివేతకు గురయ్యారు. వరదలు వచ్చిన రోజు సాయంత్రం 5 గంటల తర్వాత సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఎందరో కొట్టుకుపోయి ఉంటారని, ఆ సమయంలో అక్కడ ఉన్నవారు బతికే అవకాశాలు చాలా తక్కువని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రకోపించినా, సకాలంలో వచ్చిన ఒక్క ఎస్ఎమ్‌ఎస్ ఆ ఎనిమిది మంది శ్రామికుల కుటుంబాల్లో వెలుగులు నింపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+