Social Media: 20 ఏళ్ల తర్వాత తల్లితో మాట్లాడిన కూతురు.. పాకిస్థాన్ లో నరకం చూస్తున్నట్లు కన్నీరు..
తల్లీకూతుళ్ల బంధం విడదీయలేనిది. కానీ ఆ తల్లీకూతుళ్లు 20 ఏళ్ల తర్వాత మాట్లాడుకుంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇది ఏదో సినిమా కథ కాదు నిజమైన జీవితగాథ.. ఏ రియల్ స్టోరీ.. ముంబైలో భాను, తన కుమార్తె యాస్మిన్ షేక్ నివాసించేవారు. 2002లో యాస్మిన్ షేక్ కు ఒక రిక్రూట్మెంట్ ఏజెంట్ దుబాయ్లో కుక్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

దుబాయ్..
యాస్మిన్ షేక్ ను దుబాయ్ కి పంపాడు. అక్కడ నుంచి మానవ అక్రమ రవాణా ద్వారా ఆమె పాకిస్థాన్ కు చేరింది. అక్కడ 20 ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తోంది. కరాచీకి చెందిన సోషల్ మీడియా వినియోగదారు వలీవుల్లా మరూఫ్ యాస్మిన్ షేక్ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. వీడియోలో ఆమె రిక్రూట్మెంట్ ఏజెంట్ మోసం, పాకిస్తాన్కు వచ్చిన తర్వాత దుస్థితిని వివరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జర్నలిస్ట్..
ముంబైకి చెందిన జర్నలిస్ట్ ఖల్ఫాన్ షేక్ ఈ వీడియోను షేరు చేశాడు. షేక్ వీడియోను షేర్ చేసిన తర్వాత, బాను మనవడు అమన్ (యాస్మిన్ కొడుకు) దీన్ని మొదట గుర్తించాడు. మరూఫ్, షేక్ బాను, ఆమె కుమార్తె యాస్మిన్ షేక్ మధ్య వీడియో కాల్ ఏర్పాటు చేసినట్లు BBC నివేదించింది. యాస్మిన్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడింది.
నేను నా పిల్లలను ఎప్పుడు కలుస్తానో లేదో అంటూ ఆవేదన వ్యక్తం చేసింది యాస్మిన్.
Recommended Video


40 మంది మహిళలు
మరూఫ్.. ది ప్రింట్తో మాట్లాడుతూ, కరాచీలోని స్థానిక మసీదులో సామాజిక కార్యకర్త, ఇమామ్గా ఉన్న తాను, 15 సంవత్సరాల క్రితం యాస్మిన్ షేక్ తొలిసారి కలిశానని చెప్పాడు. యాస్మిన్ షేక్ పాకిస్తాన్లోని హైదరాబాద్లో మూడు నెలల తర్వాత కరాచీలోని మంగోపిర్లో వచ్చిందన్నారు. పాకిస్తాన్కు అక్రమ రవాణా చేయబడిన దాదాపు 40 మంది మహిళలకు వారి కుటుంబాలతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి సహాయం చేసినట్లు మరూఫ్ పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications