ఉగ్రవాదం: సొంత మిలటరీని కడిగేసిన పాక్ అమ్మాయి
కరాచీ: యూరి ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రయిక్ దాడుల తర్వాత పాకిస్తాన్ - భారత దేశాల మధ్య, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పాక్ అన్నింటా ఏకాకి అయింది. ఈ నేపథ్యంలో సొంత దేశంలోని పత్రికలే ప్రధాని నవాజ్ షరీఫ్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తీవ్రవాదం పట్ల మన తీరే ప్రపంచంలో ఏకాకిని చేస్తోందని స్థానిక పత్రికలు కథనాలు కూడా ఇచ్చాయి. మరో యువతి కూడా పాక్ను కడిగి పారేశారు. ఆమె పాకిస్తాన్కు చెందిన అమ్మాయి కావడం గమనార్హం.
పీవోకేలో భారత్ జరిపిన సర్జికల్ దాడుల తర్వాత ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఓ దశలో యుద్ధం తప్పదేమోనని అందరూ భావించారు. భారత్లో జరుగుతున్న ఉగ్రదాడులకు పాక్ వైపు నుంచి పూర్తిగా మద్దతు ఉందనేది ఎవరూ కాదనే సత్యం.
ఉగ్రవాదులకు పాకిస్తాన్ మిలిటరీ నుంచి పూర్తి సహకారాలు అందుతున్నాయి. ఉగ్రవాదులకు పాక్ మిలటరీ సహకారం పైన సదరు పాకిస్తాన్ యువతి ఆర్మీని కడిగి పారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
ఆ వీడియోలో ఆమె తీవ్రవాదంలో మిలటరీ పాత్ర అనే అంశంపై మాట్లాడారు. ఇందులో ఆమె పాక్ మిలటరీని తూర్పారబట్టారు. ఉగ్రవాదులకు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారు.
దేశంలో ఉగ్రవాదం పెరగడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుపై నిలదీశారు. అవినీతి రాజకీయ నాయకుల పైన తీవ్రంగా మండిపడింది. స్పష్టంగా, సూటిగా మాట్లాడుతున్న ఆమెను చూసి అందరూ అవాక్కయ్యారు. ఆమె ప్రసంగానికి ముగ్ధులయ్యారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications