న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు .. ఆరుగురి మృతి .. పలువురికి గాయాలు
అక్లాండ్ : న్యూజిలాండ్ లో దుండుగులు తెగబడ్డారు. రెండు ప్రాంతాల లక్ష్యంగా కాల్పులు జరిపారు. క్రిస్ట్ చర్చ్ లోరి ఓ మసీదులో కాల్పుల మోత మోగించారు. మరో ప్రాంతంలోని మసీదుపై కూడా కాల్పులు జరిపారు. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు మృతిచెందినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. మసీదులోకి ప్రవేశిస్తూనే తుపాకీతో ఫైరింగ్ చేసినట్టు స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
విచక్షణరహితంగా కాల్పులు ...
శుక్రవారం ప్రార్థనలు చేస్తుండగా .. ఒక్కసారిగా దుండగుడు ప్రవేశించాడని ప్రత్యక్షసాక్షి ఇబ్రహీం మీడియాకు తెలిపారు. పెద్దదైనా క్రిస్ట్ చర్చ్ లోని మసీదులో 200 మంది ఉన్నారని పేర్కొన్నారు. మసీదు వెనుకభాగం నుంచి ... దుండగుడు కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. చాలా సేపు కాల్పులు జరుపడంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురైనట్టు తెలిపారు. మసీదులో ఉన్న కొందరు గోడదూకి పారిపోయామని వివరించారు. మరికొందరు అద్దాలు పగులగొట్టారని .. గోడను కూల్చి పారిపోయేందుకు ప్రయత్నించారని వివరించారు.

ప్రాథమిక సమాచారం మేరకు ఐదుగురు చనిపోయినట్టు ప్రత్యక్ష సాక్షి ఇబ్రహీం తెలిపారు. క్రిస్ట్ చర్చ్ లో ప్రార్థనలు చేసి గాయపడ్డ కొందరిని క్రిస్ట్ చర్చ్ దవాఖానకు తరలించినట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications