భూకంపంతో విధ్వంసం, పలువురు గల్లంతు (పిక్చర్స్)
మనీలా: పిలిప్పైన్స్లో భారీ భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. మృతుల సంఖ్య బుధవారానికి 107కు చేరుకుంది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని అంటున్నారు. శిథిలాలను తొలగిస్తున్నా కొద్దీ శవాలు బయటపడుతున్నాయి.
మంగళవారం బోహోల్ ప్రొవిన్స్ను తాకిన భూకంపం వల్ల 3 మిలియన్ల మందిని విషాద సముద్రంలో ముంచింది. మనీలాకు దక్షిణాన 640 కిలోమీటర్ల దూరంలో గల బోహోల్ ఇప్పుడు విషాద సాగరంగా దర్శనమిస్తోంది. ఇప్పటి వరకు పలువురి జాడ తెలియడం లేదు.
బోహోల్లో ఇప్పటి వరకు 97 మంది, సిబూ, సిక్విజోర్ల్లో 10 మంది మరణించినట్లు లెక్కలు తేలాయి. దాదాపు 276 మంది గాయపడ్డారు. బోహోల్, సిబూల్లో పలు భవంతులు నేలకూలాయి. శతాబ్దాలనాటి చర్చిలు కూడా నేలమట్టమయ్యాయి. ఆస్పత్రులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ ధ్వంసమయ్యాయి. రోడ్లు, వంతెనలు బీటలు వారాయి.

సిబూలో ఇలా..
భూకంపం విధ్వంసం సృష్టించిన తర్వాత సిబూలోని బాసిలికా చర్చి వద్ద ఓ ప్రైవేట్ గార్డు ఇలా.. పిలిప్పైన్స్లోని అతి పురాతనమైన చర్చి బెల్ టవర్ కూలిపోయింది. భూకంపం తాకిడికి భవంతులు కూలిపోయాయి. రోడ్లు బీటలు వారాయి.

బోహోల్లో..
భూకంపం తాకిడికి బోహోల్ అతలాకుతలమైంది. లోబోక్ చర్చి భూకంపం తాకిడికి కూలింది. శిథిలాలను చూస్తున్న స్థానికులు. బోహోల్లో మరణాల సంఖ్య కూడా తీవ్రంగా ఉంది.

కూలిన నిర్మాణం..
భూకంప తాకిడికి భవనాలు కూలుతుండడంతో ప్రజలు వడివడిగా పరుగులు తీస్తూ దూరం వెళ్లారు. భవనాల కప్పులు కూలాయి. భవనాలు శిథిలాలుగా మారాయి. భవనాల గోడలు బీటలు వారాయి. సిబూలో దృశ్యం ఇది.

నోరు తెరిచిన భూమి...
రోడ్లు బీటలు వారి నోళ్లు తెరిచాయి. అటువంటి రోడ్ల మీద ప్రజలు భీతావహులవుతూ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించారు. బోహోల్లోని ఓ రోడ్డు నోరు తెరిచిన దృశ్యం ఇది...

శిథిలాల తొలగింపు..
కార్లపై పడిన శిథిలాలను సైనికులు తొలగిస్తూ ఇలా కనిపించారు. మంగళవారంనాటి భూకంపం పిలిప్పైన్స్ను అతలాకుతలం చేసింది. సిబూలోని ఓ దృశ్యం ఇది..

క్షతగాత్రులు ఇలా...
సిబూ సిటీని భూకంపం తాకిన తర్వాత ఆస్పత్రిలోని రోగులు ఇలా బయట కనిపించారు. భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.

కార్లు విధ్వంసం..
సిబూలోని జిఎంసి ప్లాజా భవనం వద్ద శిథిలాల కింద కార్లు కూరుకుపోయి ఇలా కనిపించింది. భూకంపంతో పలు భవనాలు కూలాయి. పలు భవనాల గోడలు బీటలు వారాయి. పైకప్పులు రాలి పడ్డాయి.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications