మోడీతో సుందర్ పిచాయ్ భేటీ-భారత్ లో ఏఐకి గూగుల్ సాయం..!
మోడీ ఫ్రాన్స్ పర్యటనలో కృత్రిమ మేథపై ఏర్పాటు చేసిన యాక్షన్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని మోడీని అనంతరం అక్కడికి వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కలుసుకున్నారు. ఏఐ ద్వారా భారత్ కు ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయో ప్రధాని మోడీకి ఆయన వివరించారు. ఏఐ రాక వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన అవసరం లేదంటూ ఈ సదస్సులో మోడీ చెప్పిన నేపథ్యంలో సుందర్ పిచాయ్ తో ఆయన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
పారిస్లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్కు హాజరైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. ఏఐతో భారత్ కు ఎలాంటి మేలు జరగబోతోందో ప్రధాని మోడీకి వివరించారు. అనంతరం మోడీతో జరిగిన భేటీపై ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. ఇందులో మోడీతో చర్చించిన అంశాల్ని పంచుకున్నారు. వీటిలో ఏఐ యాక్షన్ సమ్మిట్ కోసం ఇవాళ ప్యారిస్లో ఉన్నప్పుడు ప్రధాని మోడీని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారతదేశానికి ఏఐ తీసుకొచ్చే అద్భుతమైన అవకాశాల గురించి , భారతదేశం యొక్క డిజిటల్ పరివర్తనపై కలిసి పనిచేసే మార్గాలపై చర్చించినట్లు గూగుల్ సీఈవో పిచాయ్ తెలిపారు.

Delighted to meet with PM @narendramodi today while in Paris for the AI Action Summit. We discussed the incredible opportunities AI will bring to India and ways we can work closely together on India’s digital transformation pic.twitter.com/OXA3vfQ6OT
— Sundar Pichai (@sundarpichai) February 11, 2025
అంతకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో భేటీ అయిన ప్రధాని మోడీ.. ఆయనతోనే కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్కు కో-ఛైర్గా వ్యవహరించారు. అనంతరం ఏఐ యాక్షన్ సమ్మిట్లో ప్రసంగించిన మోడీ.. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై ఆందోళన అక్కర్లేదంటూ తేల్చిచెప్పేశారు. అలాగే ఏఐ కోసం గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు అవసరాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయంగా అందరూ కలిసి చేసే సామూహిక ప్రయత్నాలు మాత్రమే ఏఐ ప్రమాణాలను సృష్టించగలవని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ఇవి కృత్రిమ మేథపై ఆవిష్కరణలను పెంచుతాయన్నారు.
-
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం!












Click it and Unblock the Notifications